గర్భిణీ స్త్రీకి ఆయుర్వేద చిట్కాలు..
ప్రతి గర్భిణీ స్త్రీ తన గర్భాన్ని సంరక్షించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటుంది. గర్భం సురక్షితంగా ఉంటే కూడా కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు వైద్యులు.
* గర్భం ధరించిన తొలి నెలలో ప్రతి రోజూ రెండుపూటలా పాలలో కలకండను కలుపుకుని సేవించాలి.
* రెండవ నెలలో గోరువెచ్చని పాలలో శతావరీ చూర్ణం 10 గ్రాములు కలుపుకుని త్రాగాలి.
* మూడవ నెలలో చల్లటిపాలలో ఒక చెంచా నెయ్యి మరియు మూడు చెంచాల తేనె కలుపుకుని సేవించాలి. ఇలా ఎనిమిదవ నెల వరకు చేస్తుండాలంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
* నాల్గవ నెలలో పాలలో వెన్న కలుపుకుని సేవించాలి.
* ఐదవ నెలలో మళ్ళీ పాలలో నెయ్యి కలుపుకుని సేవించండి.
* ఆరు మరియు ఏడవ నెలలో మళ్ళీ పాలలో శతావరీ చూర్ణం కలుపుకుని సేవించండి.
* ఎనిమిదవ నెలలో గోధుమ రవ్వను పాలలో కలుపుకుని త్రాగాలి.
* తొమ్మిదవ నెలలో శతావరినుంచి తీసిన నూనెను 50 గ్రాముల చొప్పున ప్రతి మూడవ రోజుకు ఒకసారి ఎనీమా తీసుకోవాలంటున్నారు వైద్యులు.
* మూడవ నెలనుంచి ఎనిమిదవ నెల వరకు రెండు పూటలా పెద్ద చెంచాతో ఆవు నెయ్యిని పాలలో కలుపుకుని సేవించండి.