టీవీ యాంకర్గా తెరకు పరిచయమై, ప్రస్తుత హీరోయిన్ స్థాయికి ఎదిగిన అందాల నవ్వుల సుందరి కలర్స్ స్వాతి. ప్రస్తుతం టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్లోనూ సినిమాలో బిజీ అయిన ఈ భామకు ఛాన్సులు బాగానే వస్తున్నాయని ఇండస్ట్రీలో టాక్.
"ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" చిత్రంలో వెంకీపై మనసు పడే అమ్మాయిగా చక్కగా నటించి, ప్రేక్షకుల మార్కును కొట్టేసిన స్వాతి ప్రస్తుతం "కలవరమాయే మదిలో", అనంతపురం 1980 వంటి సినిమాల్లో నటించింది.
తమిళంలో సుబ్రహ్మణ్యపురం సినిమాలో నటించిన కలర్స్ స్వాతి, తమిళ సూపర్ స్టార్ శివాజీతో నటించడమే లక్ష్యమంటోంది. తనకు పెళ్లయిందనే వార్తలు నిజం కావని కొట్టి పారేసింది.