"ఎవరే అతగాడు" చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన సెక్సీతార ప్రియమణి. నవవసంతం, యమదొంగ, మిత్రుడు వంటి చిత్రాల ద్వారా వెండితెర కథానాయికగా నిలదొక్కుకున్న ప్రియమణికి కోలీవుడ్ "పరుత్తివీరన్" సినిమా జాతీయ అవార్డును సంపాదించి పెట్టింది.
"పరుత్తివీరన్"లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ కేరళలోని పాలక్కాడులో జన్మించింది.
కోలీవుడ్ సినీ పరిశ్రమకు ప్రముఖ దర్శకుడు "భారతి రాజా" ద్వారా పరిచయమైన ప్రియమణికి తమిళ సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. కాంచీపురం సిల్క్స్కు మోడలింగ్ చేస్తూ హీరోయిన్గా ఎదిగిన ప్రియమణికి, కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ద్వారా మంచి గుర్తింపు లభించింది.
కోలీవుడ్ మాత్రమే గాకుండా.. తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోన్న ఈ భామ బాలీవుడ్ సినీతార విద్యాబాలన్ రెండో సోదరి (దూరపు బంధువు). భయ్యా, ద్రోణ వంటి సినిమాల్లో టాలీవుడ్ సెక్సీతారగా అందాలను ఆరబోసిన ప్రియమణి, తాజాగా జగపతిబాబుతో మళ్లీ జతకట్టింది. జగపతిబాబు హీరోగా నటించే "ప్రవరాఖ్యుడు" సినిమాలో ప్రియమణి నటిస్తోంది.