1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

ఈనెలలో "కంత్రి" ఆడియో విడుదల

వైజయంతీ మూవీస్ పతాకంపై జూనియర్ ఎన్టీఆర్
WD PhotoWD
వైజయంతీ మూవీస్ పతాకంపై జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా హాన్సిక, తనీషా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "కంత్రి". మెహర్ రమేష్ దర్శకత్వంలో సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విశేషాలను నిర్మాత అశ్వనీదత్ బుధవారం రాత్రి వెల్లడించారు. ఇటీవలే దక్షిణాఫ్రికాలో రెండు గీతాలను చిత్రీకరించామని చెప్పారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ సాగిందన్నారు.

ఇందులో హీరో పేరుకు మాత్రమే కంత్రి. చిత్ర కథానాయకుడికి మాత్రం ఓ లక్ష్యం ఉంటుందని, అది ఏమిటనేది వెండితెరపై చూడాల్సిందేనని చెప్పారు. ఈనెలలో ఆడియోను విడుదల చేస్తామని చెప్పారు. ఇందులో "వన్.. టూ... త్రీ.." అనే పాటను ఎన్.టి.ఆర్. ఆలపించడం విశేషం. ఇంకా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ఆశీష్ విద్యార్థి, ముఖేష్ రుషి తదితరులు నటిస్తుండగా కెమెరా.. సమీర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. కె.సాయిబాబా.
About Writer
PNR