1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

పరుగు ఆడియోకు మంచి ఆదరణ: ఆదిత్య మ్యూజిక్స్

పరుగు ఆడియో ఆదరణ ఆదిత్య మ్యూజిక్స్
WD PhotoWD
అల్లు అర్జున్, షీలా జంటగా బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన పరుగు చిత్రం ఆడియోకు మంచి ఆదరణ లభిస్తోందని ఆదిత్య మ్యూజిక్స్ సంస్థ అధినేత ఉమేష్ గుప్త పేర్కొన్నారు. ఈ చిత్రంలోని పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని ఆయన తెలిపారు.

ఇటీవల విడుదలైన పరుగు ఆడియో విజయాన్ని పురస్కరించుకుని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమేష్ గుప్త మాట్లాడుతూ పరుగు చిత్రం పాటలు అల్లు అర్జున్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయన్నారు. ఈ చిత్రం ఆడియో లెజీ ఫెలోస్‌కు సైతం క్రేజ్‌ను కల్గిస్తున్నాయని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో పాటల రచయిత అనంత్ శ్రీరామ్ స్పందిస్తూ పరుగు చిత్రంలో తాను మూడు పాటలు రాశానని, 10 ఏళ్ల తర్వాత కూడా గొప్పగా చెప్పుకునే విధంగా ఈ పాటలుంటాయని అన్నారు.

ఈ చిత్రాన్ని నిర్మించిన సహా నిర్మాత శిరీష్ మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడే రోజున పరుగు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నామని తెలిపారు.

ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ఘన విజయం సాధించాయని, అదే తరహాలో చిత్రం కూడా అద్భుత విజయాన్ని సాధిస్తుందన్న విషయంలో తమకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన అన్నారు.
About Writer
Munibabu