యూత్ఫుల్ ఎంటర్టైనర్గా "కాల్సెంటర్"
|
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోందని, ఇటీవలే విడుదలైన చిత్ర ఆడియోకు మంచి స్పందన లభించిందని అన్నారు. సాయి కార్తీక్ ఆకట్టుకునే బాణీలు అందించారని, కణ్మణి తన దర్శకత్వ ప్రతిభతో చిత్రాన్ని చక్కగా మలిచారని తెలిపారు. యూత్ను లక్ష్యంగా పెట్టుకుని తీసిన చిత్రమైనప్పటికీ, అన్నివర్గాలను మెప్పిస్తుందని వెల్లడించారు.
దర్శకుడు కణ్మణి మాట్లాడుతూ... కాల్సెంటర్ ద్వారా చెప్పదలచుకున్న విషయాన్ని వినోదభరితంగా తీర్చిదిద్దామని, పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడ్డ యువత జీవితాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలేమిటి? వాళ్ళు మన సంస్కృతి సంప్రదాయాలకు ఇస్తున్న విలువలేమిటి? అనే అంశాలతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంత గొప్పవో చూపించబోతున్నట్లు వెల్లడించారు. ఆలోచింపజేసే విధంగా ఈ చిత్రం ఉంటుందని కణ్మణి అన్నారు. ఇంకా ఈ చిత్రంలో విజయానంద్, కరుణ, సౌమ్య, మారుతీ కుమార్, బాలాజీ తదితరులు నటించారు.