వేణు, మేఘానాయర్, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా, హరిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దీపావళి. ఎ.ఎ.ఎ. క్రియేషన్స్ పతాకంపై తీగల కృపాకర్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత సారథ్యం వహిస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది.
నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ తొలిసీడి విడుదల చేసి నటుడు సుబ్బరాజు అందించారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ.. నిర్మాతకు ఇది రెండో చిత్రమని, ఆడియోతో పాటు సినిమా కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ చిత్రంలో వేణు వైవిధ్యం కనిపిస్తాడని సినిమా బాగా వచ్చిందని. ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆకర్షిస్తారనే నమ్మకముందని నిర్మాత కృపాకర్ రెడ్డి చెప్పారు.
|