ప్రధాన పేజి > వినోదం > వెండితెర > కథనాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శశాంక్, ఆర్యమీనన్ జోడీగా కొత్త చిత్రం  Search similar articles
WD
శశాంక్, ఆర్యమీనన్ హీరో హీరోయిన్లుగా మహేష్ మూవీ మేకర్స్ పతాకంపై ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. శ్రీనివాస్ భల్ల దర్శకత్వంలో జాన్ బాప్టిస్ట్ ఈ చిత్రానికి నిర్మాత సారథ్యం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం మలేషియాలో మూడు పాటలను చిత్రీకరించుకుంది.

ఈ నెల 7 నుంచి హైదరాబాద్‌లో కీలకసన్నివేశాలను చిత్రించనున్నట్లు నిర్మాత చెబుతున్నారు. తనకు నచ్చిన చేతికళతో అనుకున్న గమ్యాన్ని ఎలా చేరాడు? అన్న పాయింట్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని, చిత్రకారుడిగా శశాంక్ చక్కగా అమరాడని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... ప్రతిభ ఉంటేనే సరిపోదని, అందుకు తగిన ప్రోత్సాహం తోడైతే ఏదైనా సాధించవచ్చనే అంశానికి ప్రేమకథను జోడించి వినోదాత్మకంగా మలిచామని చెప్పారు. శశాంక్ మాట్లాడుతూ.. పల్లెనుంచి ఏ ఆధారం లేకపోయినా పట్నం వచ్చిన ఓ కుర్రాడు తనకు వచ్చిన చేతికళతో ఎలా అనుకున్నది సాధించాడనే పాయింట్‌తోనే కథ నడుస్తుందని వెల్లడించారు. హీరోగా మంచి గుర్తింపు వస్తుందని ఆకాంక్షించారు.

ఇంకా ఈ చిత్రంలో రంగనాథ్, గాయత్రి, ఎం.ఎస్. నారాయణ, అలీ, అన్నపూర్ణ, దువ్వాసి మోహన్, మేల్కొటి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం.. మోహన్ సితార.
మరిన్ని
"సిటీలైఫ్" ఆడియో ఆవిష్కరణ
"మల్లెపూవు" శోభన్‌బాబుకే అంకితం!
పోస్ట్‌ ప్రొడక్షన్స్‌లో '16 డేస్'
ఆలోచింపచేసే 'మృగం'
11న ప్రేక్షకుల ముందుకు "దశావతార్"!
మలేషియాలో "కౌసల్య సుప్రజ రామ"