దత్తా క్రియోషన్స్ బేనర్పై ఎస్. గోపాల్, టి. ఆనంద్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "జస్ట్ 5 మినిట్స్". ప్రస్తుతం ఈ సినిమా పాటల రికార్డింగ్ కార్యక్రమం డి.ఎస్.ఆర్. స్టూడియోలో వైభవంగా ప్రారంభమైంది. కె.విశ్వనాథ్, విస్సు దగ్గర పనిచేసిన నాగులకొండ నవకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. "లెట్ హుమనిటీ ప్రివైల్" అనే ట్యాగ్లైన్ జోడించారు.
ఈ సందర్భంగా నాగులకొండ నవకాంత్ మాట్లాడుతూ...జీవితంలో జరిగే పలు సమస్యలకు, సంఘటనలకు పరిష్కారం ఏ విధంగా చేయాలనే యూనివర్శల్ పాయింట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామన్నారు. కమర్శియల్ విలువతో హాస్యాస్పదంగా రూపొందిస్తున్నామని చెప్పారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఆనంద్ మాట్లాడుతూ... ఈ సినిమాలో ఎనిమిది పాటలున్నాయని, గజల్ శ్రీనివాస్ ఈ చిత్రంలో ఓ పాట పాడుతున్నారని తెలిపారు. పాత కొత్త హీరో హీరోయిన్లతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని చెప్పారు. కెమెరా...సి. గోపాలరావు, కథ, స్క్రీన్ప్లే, మాటలు, సంగీతం..., దర్శకత్వం... నాగులకొండ నవకాంత్.
|