ఆ "థ్రిల్లర్" ఓ విచిత్రం!
Publish: Sat, 6 Sep 2008 (14:43 IST)
Updated: Sat, 6 Sep 2008 (14:39 IST)
యుటోపియా ఎంటర్టైనర్స్ సమర్పణలో ఎ.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్. కె. రఫతున్నీ సాషేక్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం "థ్రిల్లర్". తెలుగు, హిందీ భాషల్లో అజీజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి "ఒక (వి) చిత్రం" అనే క్యాప్షన్ కూడా జతచేశారు. దర్శకుడు మాట్లాడుతూ.. కాలేజీ నేపథ్యంలో యువత చేసే ఎంజాయ్మెంట్కు చక్కటి వినోదం జోడించి సస్పెన్స్తో తెరకెక్కిస్తున్నామని అన్నారు. రెండు పాటలకు డి.వి.రావు అద్భుతమైన బాణీలను సమకూర్చారని వెల్లడించారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసుకుందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఇంకా ఈ చిత్రంలో వేణుమాధవ్, షగుప్త, చిత్రం బాషా, తబర్, గుండు హనుమంతరావు, ఆదిల్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు... వెన్నెలకంటి, బి. రామ్మోహన్, కెమెరా... అమర్, ఎడిటింగ్... నందమూరి హరి, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం.. అజీజ్.