1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు

రంభ "ప్రతిక్షణం" ఏం చేస్తుంది?

వినోదం వెండితెర కథనాలు రంభ కొత్త చిత్రం ప్రతిక్షణం రంభ సోదరుడు పల్లవి శ్రీనివాసన్ వ్యాస్ దర్శకత్వం ముహూర్తపు షాట్
WD
నటి రంభ చాలాకాలం తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. భోజ్‌పూరీ చిత్రాల్లో బిజీగా ఉన్న రంభ తెలుగు, తమిళంలో రూపొందే ఓ కొత్త చిత్రంలో నటిస్తోంది. తెలుగులో ఈ చిత్రానికి "ప్రతిక్షణం" అనే పేరు పెట్టారు. ఈ చిత్రాన్ని రంభ సోదరుడు పల్లవి శ్రీనివాసన్ నిర్మిస్తుండగా, వ్యాస్ దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రంభపై చిత్రించిన ముహూర్తపు షాట్‌కు కె. రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు రాజా వన్నెంరెడ్డి క్లాప్ కొట్టారు.

ఈ సందర్భంగా రంభ మాట్లాడుతూ.. తొలిసారిగా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నానని, ఒక్కరోజులో ఓ అమ్మాయి జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల సమాహారమే ఈ చిత్రకథని అన్నారు. శనివారం నుంచి ఈ నెలాఖరు వరకు రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని, ఆ తర్వాత శ్రీలంకలో చిత్రీకరణ ఉంటుందని అన్నారు. తనకు బ్లెడ్ అంటే పడదని, ఈ థ్రిల్లర్ సినిమాలో అవేవీ ఉండవని చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ... డైలాగ్స్ పెద్దగా ఉండవని, కొత్త తరహాలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. రక్తపాతం లేని ఓ థ్రిల్లర్ కథ ఇదని, ఒకే రాత్రిలో జరిగే చిత్రమని, హీరోయిన్ చుట్టూ కథ తిరుగుతుందని దర్శకులు చెప్పారు.

ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయని, ముమైత్‌ఖాన్‌పై ప్రత్యేక సాంగ్ ఉందని కూడా ఉందని దర్శకులు అన్నారు. థ్రిల్లర్ సినిమా అయినా అందరినీ అలరిస్తుందని, ఇందులో ప్రకాష్ రాజ్ వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇంకా రియాజ్ ఖాన్, సంపత్ తదితరలు నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా... పన్నీర్ సెల్వం.
About Writer
Selvi