పాటల చిత్రీకరణలో "సామ్రాజ్యం"
|
కలువకృష్ణ సాయి రాసిన పాటను ప్రదీప్ అంథోని నృత్యదర్శకత్వంలో ప్రియాంక కొఠారిపై చిత్రిస్తున్నారు. ఎంటీవీ తరహాలో గ్రీన్ మ్యాట్లో ఉన్నత సాంకేతిక విలువలతో చిత్రిస్తున్నామని దర్శకుడు వెల్లడించారు. ఫ్యాక్షనిజం నేపథ్యంలో నడిచే ముక్కోణపు ప్రేమకథలో మానవతా విలువలు, సందేషం అంతర్లీనంగా ఉంటాయని ఆయన అన్నారు.
అక్టోబర్ 12న ఆడియోను నెలాఖరులో సినిమాను విడుదల చేయనున్నామని తెలిపారు. జయప్రకాష్ రెడ్డి, చలపతిరావు, సత్యంరాజేష్, గుండు, దండపాణి, కవిత, రక్ష, రేఖ, ఉమ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా.. టి. రాజేంద్ర, సంగీతం... చక్రి, ఎడిటింగ్... రామ్ గోపాల్ రెడ్డి.