వాళ్లిద్దరూ నన్ను విడిచిపెట్టరు: మినిష్షా లాంబ
|
" దీపికా పదుకునే నా బెస్ట్ ఫ్రెండ్. అయితే ఇండస్ట్రీలో నాకు చాలామంది స్నేహితులున్నారనుకోండి. మగస్నేహితులు కూడా (నవ్వుతూ). ముఖ్యంగా రణబీర్ కపూర్, ఇమ్రాన్ ఖాన్లు నన్ను వదిలిపెట్టరు. మేము మాటల్లో పడ్డామంటే సమయం తెలియదు. అంతగా లీనమై పోతాం.
ఈ సినీ పరిశ్రమలో నేను తెలుసుకున్నదేమిటంటే... కష్టపడి పనిచేస్తే కానీ అనుకున్నది సాధించలేం. అలాకాక ఏదో చేసేస్తున్నాం అని గనుక ప్రవర్తిస్తే... ప్రేక్షకులు తగిన రీతిలో స్పందిస్తారు. సో... అప్పుడు ఇక తిరిగి ఇంటికి వెళ్లక తప్పదు. పైగా ప్రస్తుతం సినీ పరిశ్రమలో పోటీ తీవ్రంగా ఉంది. దీనిని తట్టుకుని నిలబడాలంటే వళ్లు వంచి పనిచేయాల్సిందే. అందుకే నా మటుకు నేను దర్శకుడు ఏది చెపితే అది తు.చ తప్పక పాటిస్తున్నా" అని చెప్పింది.