అల్లరినరేష్, కామ్న జఠ్మలానీ హీరోహీరోయిన్లుగా డా.డి. రామానాయుడు నిర్మించిన "బెండు అప్పారావు" చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానాయుడు మాట్లాడుతూ.. తనకు ఎన్ని విజయాలు వచ్చినా ఈ సినిమా విజయం ప్రత్యేకమైందిగా భావిస్తున్నానన్నారు.
మౌత్టాక్తో ఆడుతోంది. టిక్కెట్లు బ్లాక్లో అమ్ముడవుతున్నాయని తెలిసింది. ఆడియో కార్యక్రమంలో తాను చెప్పినట్లుగానే నరేష్ కెరీర్లో బెండు అప్పారావు హిట్ అయిందన్నారు. ఈ సినిమా విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ.. తమకు రామానాయుడు గాడ్ఫాదర్ లాంటివారు. నాన్నకు, అన్నయ్యకు, తనకు మంచి బ్రేక్ ఇచ్చారు. తనతో నిర్మించిన ఈ చిత్రం విజయం సాధించడం ఆనందంగా ఉంది. భారీ ఓపెన్సింగ్ ఈ సినిమాకు రావడం విశేషమని నరేష్ అన్నారు.