ఇక నుంచి వయసుకు తగిన పాత్రలే వేస్తానని అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. దిల్ రాజు, ప్రకాష్ రాజ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం శివరాత్రి తర్వాత ప్రారంభం కాబోతోంది.
"ఆకాశమంత" చిత్ర దర్శకుడు రాధామోహన్ దర్శకత్వం వహించనున్నారు. తన కుటుంబంలో హీరోలు వస్తుంటే.. వారికి తనకూ పోటీ లేదనీ, వారికి వారికి మధ్య మాత్రమే పోటీ ఉంటుందని తెలిపారు.
మీరు చేయబోయే చిత్రాల్లో లవ్, సెంటిమెంట్ ఉంటుందా...? అని అడిగితే.. ఇంకా లవ్ చిత్రాలు ఏం చేస్తాం... అవన్నీ టీనేజ్ అబ్బాయిలే చూసుకుంటారు. వయసుకు తగిన పాత్రలు వేస్తేనే మంచిదని స్పష్టం చేశారు.
రేపు ప్రారంభం కాబోయే చిత్రం యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రమన్నారు. రొమాంటిక్ చిత్రాలు చేయాలని ఉన్నా... ప్రేక్షకులు చూడాలి కదా... అని వ్యాఖ్యానించారు. అమితాబ్ బచ్చన్ చూడండి.. వయసుకు తగిన పాత్రలు వేస్తున్నారని ఉదాహరణగా కూడా చెప్పారు. ప్రస్తుతం ఆయన నటించిన "కేడీ" ఈనెల 12న విడుదల కానుంది.