ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఈరోజు మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. తన దేహంలో క్యాన్సర్ కణాలు ప్రవేశించాయని ఇటీవలే వైద్యులు తెలిపారని వెల్లడించారు. వృద్దాప్యంలో ఈ క్యాన్సర్ కణాలు నెమ్మదిగా పని చేస్తాయని వైద్యులు తెలిపారన్నారు. అక్టోబర్ 8న తనకు కడుపునొప్పి వచ్చిందని దాంతో, కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నానని పేర్కొన్నారు. మనోబలం, అభిమానుల ఆశీర్వచనాల వల్లే ఆరోగ్యాన్ని అధిగమించానని.. మనోబలానికి మించి ఇన్నాళ్లు అభిమానుల ప్రోత్సాహం వల్లే సినిమాల్లో పనిచేస్తున్నానన్నారు.