ప్రధాన పేజి   వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
'రోబో'కు రజనీ గ్రీన్ సిగ్నెల్!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'శివాజీ' కాంబినేషన్ మరో సంచలనానికి నాంది పలుకనుంది. తాజాగా శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న భారీ బడ్జెట్ చిత్రం 'రోబో'కు రజనీకాంత్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు కోడంబాక్కం వర్గాల భోగొట్టా. దాదాపు వంద కోట్ల రూపాయల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు అయ్యంగరన్‌ ఇంటర్నేషనల్‌, ఈరోజ్‌ మల్టీమీడియా సంస్థలు సోమవారం ముందుకు వచ్చాయి. ఈ రెండు సంస్థల ప్రతినిధులైన కరుణామూర్తి, కిషోర్‌ లుల్లాలు ఈ విషయంపై సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

అందులో భారతదేశంలో ఇప్పటి వరకు వెలుగు చూడనటువంటి కథాంశంతో, సాంకేతిక నైపుణ్యం, భారీ బడ్జెట్‌ చిత్రంగా 'రోబో'ను నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. ఏక కాలంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందే ఈ చిత్రంలో రజనీకాంత్‌ హీరోగా నటిస్తారని, ఏఆర్‌ రెహమాన్‌ సంగీత బాణీలు సమకూర్చుతారని వివరించారు. ఈ చిత్రం మిగిలిన వివరాలను 'శివాజీ' సిల్వర్ జూబ్లీ వేడుకల సమయంలో దర్శకుడు శంకర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు వారు పేర్కొన్నారు.

ఇదిలావుండగా.. తొలుత ఈ ప్రాజెక్టును బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్‌తో తలపెట్టారు. ఈ చిత్రాన్ని షారూఖ్ తన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ద్వారా నిర్మించేందుకు సన్నాహాలు చేశారు. అయితే.. కథకు సంబంధించిన పూర్తి స్ర్కిప్టు కావాలని పట్టుపట్టడంతో శంకర్ నిరాకరించారు.

దీంతో శంకర్ - సూపర్‌స్టార్‌తో చర్చలు జరుపగా అందుకు ఆయన సమ్మతించారు. ఇదిలావుండగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ హాటెస్ట్ స్టార్ దీపికా పడుకొనేను హీరోయిన్‌గా ఎంపిక చేసేందుకు శంకర్ నిర్ణయించినట్టు వినికిడి.
మరిన్ని
'ఓం శాంతి ఓం' భామ దెబ్బకు యూవీ బౌల్డ్
మరో సంచలనానికి రజనీ-శంకర్ శ్రీకారం!
ముమైత్‌ఖాన్ ఫుల్ ఎక్స్‌ఫోజ్..?
ఐటం సాంగ్‌ "శివాజీ"తోనే చేస్తా: నయనతార
"సెక్సీ క్వీన్" కేసు విచారణ వాయిదా!
తమిళ చిత్రంలో "ఐటం సాంగ్‌" చేసిన శ్రియ