సెన్సేషనల్ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించనున్నాడు. ఈ విషయాన్ని వర్మే నిర్ధారించారు. వర్మ ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్ నటించే డిపార్ట్మెంట్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాణా ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో విడుదలకానుంది. అలాగే తెలుగులో యువహీరో నాగ చైతన్య, అమలా పాల్ జంటగా నటిస్తున్న బెజవాడను వర్మ సొంత బ్యానెర్లో నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు చిత్రాల షూటింగ్ పూర్తయిన తర్వాత మహేష్ బాబు ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న 'బిజినెస్మేన్', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' చిత్రాల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా, తెలుగు హీరోయిన్ దివంగత దివ్య భారతి బయోగ్రఫీ చిత్రంతో పాటు.. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు రామ్ గోపాల్ వర్మ ఆసక్తి చూపుతున్నారు.