దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు తారలంటే అభిమానం ఎక్కువేనని అంటోంది దీక్షాసేథ్. 'మిరపకాయ్' చిత్రం తర్వాత ఎన్నో ఆఫర్లు వచ్చాయని, తెలుగు ప్రేక్షకులు తనకు మంచి గుర్తింపు ఇచ్చారని చెప్పింది. తాజాగా 'రెబల్', 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' చిత్రాల్లో నటిస్తోంది. సినిమారంగంలో అడుగుపెట్టడానికి లక్ష్యాలేమీ ఏర్పరచుకోలేదు. వచ్చినవాటిని సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా ఉంది. ఈ రంగంలోకి రాకపోతే... నేను నా ఫ్యామిలీ, కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసేదాన్ని.