శ్రీదేవి, షకీరా 'ఓమ్ శాంతి ఓమ్'
బుధవారం, 20 జూన్ 2007( 12:35 IST )
ఒకనాటు దక్షిణ భాషలతో పాటు.. హిందీ చిత్ర రంగాన్ని ఏలిన వెటరన్ నటి శ్రీదేవి మళ్లీ వెండి తెరమీద కనిపించబోతోంది. ఫరాఖాన్ నిర్మిస్తున్న 'ఓమ్ శాంతి ఓమ్' సినిమాలో అభిషేక్ బచ్చన్తో కలిసి నటించనుంది. తొలుత ఈ సినిమాలో జితేంద్రతో కలిసి శ్రీదేవి నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే.. తగినంత టైం లేకపోవడంతో ఫరాఖాన్ శ్రీదేవిని అభిషేక్తో సరసన నటింపజేసేందుకు సన్నాహాలు చేశారు.
ఇంకా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ను కూడా నటించాలని ఫరాఖాన్ కోరిందట. అపుడు ఐష్-అభి పెళ్లి బిజీలో ఉన్న అమితాబ్ ఒప్పుకోలేదు. అలాగే.. ఈ చిత్రంలో ప్రపంచ కుర్రకారును ఉర్రూతలూగిస్తున్న షాకిరాతో రెండు పాటలలో నటింపచేయడానికి ఫరాఖాన్ తీవ్రంగా కృషి చేస్తోందట. దీనివల్లే సినిమా తదుపరి షెడ్యూల్కు ఆలస్యమవుతోందని తెలుస్తోంది.