170 ప్రింట్లతో సెప్టెంబరు 10న రెసిడెంట్ ఈవిల్ 4 చిత్రాన్ని మరణం తర్వాతగా విడుదల చేస్తున్నట్లు నిర్మాత నట్టికుమార్ తెలిపారు. సోనీ పిక్చర్స్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో తీస్తున్నట్లు ఆయన తెలిపారు.
నాలుగు థియేటర్లలో 3డి సినిమా విడుదలవుతుందనీ, మిగిలినవి 2డి ఫార్మెట్లో ఉంటాయని ఆయన అన్నారు. మరణం తర్వాత ప్రేతాత్మ భయంకరంగా మారి ప్రపంచాన్ని నాశనం చేసే శక్తిగా ఎదుగుతుందనీ, ఈ నేపథ్యంలో కథ సాగుతుందన్నారు.
2012 యుగాంతం తర్వాత అంత హిట్ చిత్రంగా ఇది నిలుస్తుందన్నారు. పాల్ డబ్ల్యు. ఎస్. ఆండర్సన్ దీనికి దర్శకుడు.