'మాస్టర్', 'రాజకుమారుడు', 'సముద్రం', 'స్నేహితులు', 'సింహరాశి' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సాక్షిశివానంద్. మోడరన్ గాల్గా అటు గ్లామరస్ పాత్రల్లోనే గాక.. ఒద్దికైన పాత్రల్లో అశేష అభిమానులను తన సొంతం చేసుకుందీ నటిమణి. అమె నటించిన ఆఖరి చిత్రం రాజశేఖర్ హీరోగా నటించిన 'సింహరాశి'
చిరంజీవి, మహేష్బాబు, నాగార్జున వంటి అగ్రహీరోల సరసన నటించిన సాక్షి శివానంద్.. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు తెరపై దర్శనమివ్వనుంది. జేడీ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న హోమం చిత్రంలో ఓ ఐటెం సాంగ్లో తళుక్కుమంటుంది. ఈ సందర్భంగా వెబ్దునియా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ... సినిమాలకు ఎందుకు దూరమయ్యారో తెలుసుకోవచ్చా..? జీవితంలో సినిమా ఒకటే కాదు.. చాలా ఉన్నాయి. వాటన్నింటినీ నెరవేర్చాలి. అందులోను నా స్టడీస్కు ఆటంకంగా ఉండటంతో అవకాశాలు వస్తున్నా తిరస్కరించాను. అందరూ ఫ్యాషన్ డిజైన్లని అంటున్నా.. నాకెంతో ఇష్టమైన జ్యువెలరీ డిజైన్ కోర్సును లండన్లో పూర్తి చేశాను.
మరి జ్యువెలరీ కోర్సును చేసి.. మళ్లీ వెండతెరపై నటించడంలో ప్రత్యేక కారణముందా....? ప్రత్యేక కారణమంటూ ఏదీ పెద్ద లేదు.. హోమం చిత్ర దర్శకుడు జేడీ చక్రవర్తి, హీరో జగపతిబాబు నాకు ఆప్తమిత్రులు.. కనుకే ఈ చిత్రంలో ఐటెం సాంగ్ చేసేందుకు ఒప్పుకున్నా.. టాలీవుడ్ నాకు కొత్త కాకపోయినా.. ఇక్కడ మళ్లీ నటించడం కాస్తంత సంతోషంగా ఉంది. ఇక నా జ్యూవెలరీ కోర్సు అంటే.. దానికి సంబంధించే త్వరలో వ్యాపారాన్ని ప్రధాన నగరాల్లో ప్రారంభించనున్నాను. అలాగే హైదరాబాద్లో కూడా ప్రారంభించాలనే అలోచనలో ఉన్నాను.
టాలీవుడ్లో ఇది మీ రెండో ఇన్నింగ్స్ అనుకోవచ్చా..? నో.. ఛాన్స్.. మంచి అవకాశాలు వచ్చినా.. డబ్బు వచ్చినా, రాకున్నా. ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుంది. నా జీవితంలో నటన అనేది ఒక భాగం మాత్రమే. నేను సాధించాల్సింది చాలా ఉంది. అందుకే నటిగా అవకాశాలొచ్చినా ఇక చాలనుకుంటున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో నా పిల్లల ముందు మంచి అమ్మగా నిలబడాలని ఆశిస్తున్నాను.
|