కానీ ఆ సన్నివేశంలో అంతకన్నా బలమైన డైలాగులుంటే బాగుండేదని అనిపించింది. దీనిపై మీరేమంటారు ? కరెక్టే... కానీ అప్పటికే కథ ఎక్కువైనట్టు అనిపించడంతో డైలాగులు తగ్గించి కేవలం ప్రకాష్రాజ్ ఫీలింగ్స్తోనే ముగించాల్సి వచ్చింది.
ఈ సినిమాలో లేచిపోయినవారు ఆర్యసమాజంలో పెళ్లి చేసుకోవడం... ఆ తర్వాత సంఘటనలు అన్నీ మెగాస్టార్ కుటుంబానికి సంబంధించిన విషయాల్ని పోలి ఉన్నాయన్న వార్తలు వినిపించాయి. ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా ? పరుగు చిత్రం కథ ఎనిమిదినెలల క్రితం అనుకుని చేసింది. మేం షూటింగ్ చేశాక కొన్ని సంఘటనలు యాదృశ్చికంగా అలా జరిగి ఉండవచ్చు. పైగా ఆర్య సమాజంలో జరిగే చాలా పెళ్లిళ్లు ఇలానే జరుగుతున్నాయి. అయితే ఈ కథను అల్లుఅర్జున్ విన్నారు. చిరంజీవి గారికి కూడా వినిపించాం. ఆయన చాలా బాగుందన్నారు. అప్పటికీ ఈ సంఘటనలు జరగలేదు. కాబట్టి చిత్రానికి, చిరంజీవి గారి కుటుంబంలో జరిగిన సంఘటనలకు సంబంధం లేదు.
ఈ చిత్రాన్ని చూశాక చిరంజీవి నుంచి ఎలాంటి స్పంధన వచ్చింది ? చిరంజీవిగారు ఈ చిత్రాన్ని చూసి చాలా బాగుందన్నారు. చక్కని సందేశాన్ని ఇచ్చారంటూ ఆయన కితాబిచ్చారు. తండ్రీ కుతుళ్ల సంబంధాన్ని చూపించిన తీరు బాగుందన్నారు. ఒకవేళ పరుగు చిత్రంలో చిరంజీవిగారి కుటుంబానికి సంబంధించిన విషయాలుంటే ఆయనే కట్చేయమని చెప్పేవారు కదా.
ఏది ఏమైనా మానవీయ సంబంధాలను చక్కగా తెరకెక్కిస్తున్నారు. మీ తదుపరి చిత్రం ఎలా ఉంటుంది ? ఇంతటితో ఈ సెంటిమెంట్ చిత్రాలకు ఫుల్స్టాప్ పెట్టాలనుకుంటున్నాను. ఈసారి అందరిని అలరించే ఎంటర్టైన్మెంట్ చిత్రం చేయాలనుకుంటున్నాను. అక్కినేని నాగార్జున కొడుకు నాగచైతన్యతో చిత్రం చేయనున్నారని తెలిసింది ? ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదు. అవన్నీ ఊహాగానాలు మాత్రమే.
అపరిచితుడు విక్రమ్తో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది ? అవును. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇంతవరకు రాని సెన్సేషనల్ కథతో తెరకెక్కించాలనుకుంటున్నాను. అన్నీ కలిసివస్తే అది ఓ గొప్ప చిత్రం అవుతుంది. దాని గురించి త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తా.
|