భవిష్య ఆర్ట్స్ బేనర్పై మరుధూరి రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అధ్యక్షా...!' అందరికీ వందనాలు. బ్రహ్మాజీ, రఘుబాబు, జీవా ఈ చిత్రంలో ప్రధానపాత్రలు పోషించగా విజయచందర్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ఓ సామాన్యపౌరుడు తిరగబడితే పర్యవసనాలు ఎలా ఉంటాయనే అంశంతో ఈ చిత్రం రూపొందింది.
నేటి సమాజంలో ఎక్కువైపోయిన భూకబ్జాల ఇతివృత్తంతో ఈ కథ మలచబడింది. సమాజంలో గౌరవప్రదమైన, భాద్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ భాద్యతలను విస్మరిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందన్న విషయాన్ని దర్శకుడు ఈ చిత్రం ద్వారా వివరించే ప్రయత్నం చేసాడు.
కథా విషయానికొస్తే ఓ సాధారణ ఉపాధ్యాయుడైన విజయచందర్కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. అందులో పెద్దకుమారుడైన సూర్య కాలేజీ లెక్చరర్గాను, రెండో కుమారుడు ప్రైవేటు ఉద్యోగిగాను చేస్తుంటారు. ఉపాధ్యాయునిగా రిటైర్ అయిన తర్వాత విజయచందర్ తనకున్న స్ధలంలో ఓ ఇంటిని నిర్మిస్తాడు. తీరా ఆ యింటిలో గృహప్రవేశం చేసే సమయానికి అక్కడికి వచ్చిన గూండాలు ఆ ఇంటిని కబ్జా చేస్తారు.
|