రఘుబాబు, శివాజీ రాజా హీరోలుగా యనమల హర్షిణి రెడ్డి సమర్పణలో, మంజునాథ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కె. రమణారావు దర్శకత్వంలో యనమల బాబిరెడ్డి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ "మొండి మొగుళ్లు పెంకి పెళ్లాలు".
ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునేలా ఈ కుటుంబకథా చిత్రాన్ని రూపొందించామన్నారు. ప్రతి ప్రేక్షకుడూ తనను తాను ఐడెంటిఫై చేసుకునేలా ఈ చిత్రకథ రూపొందిందని చెప్పారు.
ఇంకా ఈ చిత్రంలో గీతాసింగ్, సుభాషిణి, రాఖీ, శీతల్, బాబిలోనియా, బండజ్యోతి, జెన్నీ, విజయ్ మాధవ్, రమ్య, దినేష్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి కెమెరా... కళ్యాణ్ సమి, ఎడిటింగ్... మోహన్ రామారావు, సంగీతం... సిద్ధు, సమర్పణ.. కుమారి యనమల హర్షిణిరెడ్డి, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం... కె. రమణారావు.
ఈ చిత్రంలోని కొన్ని అద్భుత హాస్య సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి