రిషి, సౌమ్య హీరోహీరోయిన్లుగా నటించిన "దమ్మున్నోడు" చిత్రం విడుదలకు సిద్ధమైంది. బి.వి.వి. చౌదరి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
వందేమాతరం పాటలను చక్కని క్వాలిటీతో ఇచ్చారని, భాగ్యలక్ష్మి బంపర్డ్రా చూసి రిషిని ఎంపిక చేశామని దర్శకుడు వెల్లడించారు. పాత్రగురించి చెప్పిన వెంటనే రిషి ఒప్పుకున్నారని, మాస్ హీరోగా రిషి నిలదొక్కుకుంటారని తెలిపారు.
వందేమాతరం శ్రీనివాసరావు సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని దర్శకుడు అన్నారు.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.