ఆంధ్రావని | పుణ్య క్షేత్రాలు | సముద్ర తీరాలు | పర్వత ప్రాంతాలు | అటవీ అందాలు
ప్రధాన పేజి » వినోదం » పర్యాటక రంగం » పర్వత ప్రాంతాలు » ఎడారిలో మంచు పుష్పం "మౌంట్ అబూ" (Tourism | mountains | aravali | mount abu | rajasthan | gujarat | nakki pond)
 
Mountain
FILE
ఆరావళీ పర్వత శ్రేణులలో అందమైన రాణిలాగా వెలిగిపోతుండే "మౌంట్ అబూ" చిరునవ్వుతో సుస్వాగం పలుకుతున్నట్లుగా ఉంటుంది. పకృతి గీసిన చిత్రాలనే కాకుండా, పరవశింపజేసే ఆలయాలను సైతం తనలో ఇముడ్చుకున్న మౌంట్ అబూలో రాజస్థాన్ హస్తకళల అందాలకూ కొదవేలేదు.

అలాగే నక్కి సరస్సు జల సౌందర్యం, దిల్‌ఖుష్ చేసే దిల్‌వారా ఆలయాలు, వశిష్ట మహర్షి ఆశ్రమం... ఇలా ఒక్కటేమిటి, ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అద్భుతమైన ప్రదేశం "మౌంట్ అబూ". ఎర్రటి ఎండలనే కాదు, చల్లటి మౌంట్ అబూను తనలో దాచుకున్న రాజస్థాన్ వెళ్లేందుకు "అయ్యో.. ఎర్రటి ఎండల్లోనా...?" అని గాబరా పడాల్సిందేమీ లేదు.. ఎంచక్కా మన మౌంట్ అబూ ఉండనే ఉందిగా మరి...!!

ఆరావళీ పర్వతశ్రేణులలో ఉండే "అబూ" అనే కొండమీద ఉన్న ఒక చిన్న పట్టణమే "మౌంట్ అబూ". సుమారు నాలుగు వేల అడుగుల ఎత్తున ఉన్న కొండమీద ఉండే ఈ అబూ పట్టణం రాజస్థాన్ రాష్ట్రం దక్షిణపు అంచుల్లోను, గుజరాత్ రాష్ట్రానికి ఆనుకుని ఉంటుంది.

ఇక్కడ మనసును దోచుకునే అతి గొప్ప విశేషం ఏంటంటే... దిల్‌వారా అనే చోట ఉండే జైన దేవాలయం. లలితకళలు, శిల్పం ఇత్యాది విషయాలపట్ల ఏ మాత్రం ఆసక్తిలేనివారు సైతం దిల్‌వారాలోని ఆలయాలను చూస్తే నిశ్చేష్టులైపోతారు. అంత సుందరంగా ఉండే ఆ ఆలయాలను 12 గంటల తరువాత మాత్రమే తెరుస్తారు. వీటిని తృప్తిగా చూడాలంటే కనీసం రెండు గంటల సమయం అవసరం. ఇక్కడి "అచలాగడ్" అనే ప్రదేశంలోని ఈశ్వరుడి గుడి కూడా చాలా ప్రాశస్త్యమైనదే.
సూర్యాస్తమయం అత్యద్భుతం
నక్కి సరస్సు ఒడ్డుమీద సుమారు ఒక కిలోమీటర్ దూరం నడచి వెళ్ళినట్లయితే... సరస్సుకు పడమటివైపున ఉండే రెండు చిన్న కొండల నడుమ కనిపించే సూర్యాస్తమయ దృశ్యం అత్యద్భుతంగా ఉంటుంది. ఈ దృశ్యం చూసేందుకు వెళ్లే దారిలోనే ఒక చోట చిన్న గుట్టమీద ఒకరాయిపై మరో రాయి...


"ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం" అనేది మౌంట్ అబూలో చెప్పుకోదగ్గ ప్రపంచ ప్రఖ్యాత సంస్థ. ఈ పట్టణానికి బయట దాదాపు 4 కి.మీ దూరంలో ఉండే ఈ సంస్థకు సంబంధించిన మూడు ప్రదేశాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి.. జ్ఞాన సరోవర్, రెండు.. ఓం శాంతి భవనం, మూడు.. శాంతివనం.

ఈ మూడు ప్రాంతాలలో ఎన్నో ఎకరాల విస్తీర్ణం ఉన్న ఉద్యానవనాల మధ్య, మనం ఊహించలేనంత పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. ఈ మూడింటిలోనూ బ్రహ్మకుమారి సంస్థకు సంబంధించిన తాత్విక చింతన, ఆధ్యాత్మిక దృష్టికి సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయి. ఈ భవనాలలోని చిత్రాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ తరువాత అబూ నడిబొడ్డున ఉండే రోడ్డుపైనే వీరి "మ్యూజియం" కూడా కలదు.

అబూ పట్టణం నెలవైన కొండ ప్రాంతానికి అధిదేవతగా పిలువబడే "అధర్‌దేవి ఆలయం" కూడా చూడదగ్గది. దీనినే అర్బుదదేవి మందిరం అని కూడా అంటుంటారు. అబూ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో కొండ అంచున ఉండే ఓ చిన్న గుడే ఇది. ఈ చిన్న ఆలయం ఒక చిన్న గుహలాంటి చోట ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే, సుమారు 200 మెట్లు కొండ అంచునే ఎక్కుతూ వెళ్లాలి.

ఇక మౌంట్ అబూకు మూడు కి.మీ దూరంలో కొండ అంచున ఉండే అద్భుతమైన ప్రాంతం "హనీమూన్ పాయింట్"గా పేరుగాంచింది. ఈ కొండ ఆనుకుని నిట్టనిలువుగా కొన్ని వందల అడుగుల లోతులో ఉండే చదునైన లోయప్రాంతం, దూరంగా ఉండే ఒకటి రెండు చిన్న గ్రామాలతో కూడినదే ఈ ప్రాంతం. కొండ అంచున నిలబడి ఈ మనోహరమైన దృశ్యం చూసేందుకు అనువుగా ఇక్కడ సిమెంట్‌తో ఫ్లాట్‌ఫామ్స్ కట్టబడి ఉంటాయి.
 
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.