ఆంధ్రావని | పుణ్య క్షేత్రాలు | సముద్ర తీరాలు | పర్వత ప్రాంతాలు | అటవీ అందాలు
ప్రధాన పేజి » వినోదం » పర్యాటక రంగం » పర్వత ప్రాంతాలు » సింధులోయ సౌందర్య చిహ్నం "లడక్‌" (Tourism | mountains | ladakh | jammu kashmir | himalaya mountains | karakoram | kargil | leh)
 
Mountain
FILE
అలాగే "జో-ఖంగ్" అనే బౌద్ధుల ఆలయం కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. మెయిన్ బజార్, దాని పక్కనే ఉండే చాంగ్ గలి దుకాణాల సముదాయాలు.. అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉంటాయి. టిబెట్ వ్యాపారులు అమ్మే రత్నాలు, ఇతర ఆభరణాలు ఇక్కడ విరివిగా లభిస్తుంటాయి.

లెహ్ ప్రధాన రహదారిలోని "డాక్ బంగ్లా కాంప్లెక్స్" దిగువన ఉండే ఫోర్ట్ రోడ్డు నుంచి కొద్ది దూరం ప్రయాణిస్తే స్కరా అనే కుగ్రామం ఉంటుంది. ఇక్కడ "జొరావర్ సింగ్" అనే రాజు నిర్మించిన కోటను చూడవచ్చు. ప్రస్తుతం ఈ కోట "ఆర్మీ బారక్స్‌"గా సేవలందిస్తోంది. ఇక లెహ్‌కు 10 కిలోమీటర్ల దూరంలోగల "చొగ్లంసర్" అనే గ్రామం కూడా చూడదగ్గదే. టిబెట్ శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోన్న ఈ గ్రామం కార్పెట్ల తయారీకి చెందిన అతిపెద్ద కుటీర పరిశ్రమకు నెలవు. కాగా.. టిబెటన్ల మత గురువు దలైలామా ప్రార్థనలు జరిపిన స్థలం అయిన "జీవత్సల్" ఇదే గ్రామంలో ఉండటం మరో విశేషం.

"ఇండస్‌"కు దిగువన "ఖలాట్సి-షయోక్‌ ఇండస్‌"ల మధ్య "డ్రోకా-పా" అనే ప్రాంతం కూడా చూడదగ్గ మరో పర్యాటక ప్రాంతం. ఇక్కడ నివసించేవారంతా బౌద్ధమతస్తులు కావడం విశేషం కాగా... మిగతా లడక్‌ వాసులతో పోలిస్తే వీరి జీవన విధానం చాలా వేరుగా ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఐదు గ్రామాలు ఉండగా.. దహ్‌, బయామా అనే గ్రామాల ప్రకృతి సౌందర్యం సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తుంది.

ఇదిలా ఉంటే.. ఒకప్పుడు నదీనదాలతో పచ్చిక బయళ్ళతో అలరారిన లడక్‌ ప్రాంతం ఇప్పుడు తన మునుపటి వైభవాన్ని కోల్పోయింది. శీతాకాలంలో పర్వత ప్రాంతాలపై ఉండే మంచు కరగడం ద్వారా వచ్చే నీరే లడక్‌ ప్రాంత ప్రజల వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా మారింది. ఇక్కడ వర్షాలు కురిసినా అవి అననుకూల వర్షాలు కావడంతో అంతగా ఉపయోగం ఉండదు.

నిజం చెప్పాలంటే ఇక్కడి ప్రజలు వర్షాలు కురవాలని కోరుకోరు. ఎండ బాగా కాయాలని మాత్రమే వారు కోరుకుంటారు. ఎందుకంటే... ఎండ బాగా కాస్తే మంచు కరిగి నీరుగామారి తమ పంటలకు కావల్సినంత అందుతుందన్న ఆశే అందుకు కారణం. అయితే వారి ప్రార్థనలను ఆ దేవుడు ఆలకించాడో ఏమోగానీ.. ఇక్కడ ఏడాదిలో 300 రోజులు ఎండ విపరీతంగా ఉంటుంది. అయితే వేసవికాలంలో 27 డిగ్రీల సెల్సియస్‌ ఉండే ఉష్ణోగ్రత శీతాకాలంలో మైనస్‌ 20 డిగ్రీలకు పడిపోతుంది. అయితే గాలిలో తేమ తక్కువగా ఉన్న కారణంగా ఈ ప్రాంతంలోకి సూర్య కిరణాలు చొచ్చుకుని వస్తుంటాయి.

మరోవైపు.. కాశ్మీర్ విషయంలో మనకు, మన దాయాది దేశానికి మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్తతలు, సమస్యల కారణంగా "లడక్"లోని అనేక ప్రాంతాలలోకి వచ్చే విదేశీ పర్యాటకుల ప్రవేశంపై అనేక పరిమితులను విధించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే విదేశీయుల ప్రవేశం పూర్తిగా నిషిద్ధమనే చెప్పవచ్చు. అయితే, మరికొన్ని ప్రాంతాలకు మాత్రం విదేశీయులు గుంపుగా వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు. దీనికి కూడా డిప్యూటీ కమీషనర్ అనుమతి మాత్రం తప్పనిసరి. అలాగే శ్రీలంక, మయన్మార్ దేశస్థులకయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.