కావేరీ నదిమీద ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన హొగెనక్కల్ జలపాతం భారతీయ నయాగరాగా పేరుగాంచింది. తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం, వనమూలికల ఔషధ విలువలతో అలరారుతూ సందర్శకులకు ఓ వైపు ఆహ్లాదాన్ని, మరోవైపు ఆరోగ్యాన్ని అందిస్తోంది. దక్షిణ ఆసియాలోనే అతి ప్రాచీన కార్బొనెట్ శిలలు ఉన్న ఈ జలపాతం బోటు షికారుకు కూడా పెట్టింది పేరు.