ప్రధాన పేజి   వినోదం > పర్యాటక రంగం > పుణ్య క్షేత్రాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
త్రిస్సూర్ పండుగలో గజరాజుల వైభవం
Elephant
WD
గజరాజులు కొలువుదీరి కనువిందు చేసే ఏకైక ప్రదేశం కేరళలోని త్రిస్సూర్ అని చెబితే అతిశయోక్తి కాదు. ఇటీవల కేరళ నూతన సంవత్సరం మేదమ్ సందర్భంగా ఏనుగుల ప్రదర్శన అత్యంత వైభవంగా జరిగింది. అత్యంత వైభవంగా పురమ్ పేరన కేరళ ప్రజలు జరుపుకునే ఈ పండుగనాడు ఏనుగులకు అందమైన అలంకరణలు చేశారు.

మలయాళీ నూతన సంవత్సరం మేదమ్ నాడు వడక్కునాధన్ ఆలయం వెలుపల నిర్వహించే పూరమ్ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి ఏనుగులను అందంగా అలంకరించి మేళతాళాలతో వేడుకగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవం తొలి సంధ్య వేళల్లో ప్రారంభమై మరుసటి రోజువరకూ సాగుతుంది.

ప్రతి గ్రూపులోనూ కనీసం పదిహేనుదాకా ఏనుగులు ఉంటాయి. ప్రతి గ్రూపు తమతమ ఏనుగుల ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తారు. మొత్తం మీద అత్యంత వైభవంగా ఈ ఉత్సవం జరుగుతుంది. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్న కేరళ ప్రజలు తమ తమ పండుగలలో ఏనుగుల ప్రదర్శనకు తావు లేకుండా ఎట్టి పరిస్థితిలోనూ నిర్వహించరంటే నమ్మి తీరాల్సిందే మరి.
వీడియోను వీక్షించండి
మరిన్ని
రామప్ప ఆలయం
చంద్రుడు నిర్మించిన బంగారు ఆలయం
కామాక్షిదేవి కొలువైన కాంచీపురం
భక్తులకు ఇలవేల్పు భద్రాద్రి
రాజస్థాన్‌లో వింతైన శివాలయం
సాంచిలో బౌద్ధ క్షేత్రం