ప్రధాన పేజి > వినోదం > పర్యాటక రంగం > పుణ్య క్షేత్రాలు > 'సకల దేవతల' నిలయం "కళాధామం"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
'సకల దేవతల' నిలయం "కళాధామం"
FILE

"కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు" అన్నది నాటి మాట. "మనిషి తలచుకుంటే ఈ సృష్టికే ప్రతిసృష్టి చేయగలడు" అనేది నేటి మాట. చాలా సందర్భాల్లో ఈ విషయం తేటతెల్లమైనప్పటికీ... "కుందా సత్యనారాయణ కళాధామం" దర్శించినట్లయితే, ఈ మాట ఎంత అక్షర సత్యమో మనకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతుంది.

మనం తరచుగా వెళ్లే దేవాలయాలలో మహా అయితే... ముగ్గురో, నలుగురో దేవతామూర్తులను ఒకే చోట చూసి ఉంటాము. కానీ భగవంతుడి దశావతారాలన్నింటినీ ఒకేచోట చూడాలంటే సాధమయ్యేపనేనా..? అనిపిస్తుంది కదూ..! ఇంతటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు కుందా సత్యనారాయణగారు. పురాణేతిహాసాల్లోని పాత్రలన్నింటికీ దృశ్యరూపం కల్పించి... "కుందా సత్యనారాయణ కళాధామం"గా తీర్చిదిద్దారు.

దీనినే "పద్మవ్యూహం" అని కూడా పిలుస్తుంటారు. ఈ కళాక్షేత్రంలో రామాయణం, మహాభారతం, భాగవతాలలోని అపురూప ఘట్టాలను దృశ్యరూపంలో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్‌ నగరానికి కేవలం 60 కి.మీ దూరంలో, నల్గొండ జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు సమీపంలోని సురేంద్రపురిలో కొలువుదీరి ఉంది ఈ ఆధ్యాత్మిక కళాక్షేత్రం.
కమలంలో పుష్పాసనంలో...
  బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, నాగలోకం, ఇంద్రలోకం, యమలోకం, పాతలలోకం, పద్మవ్యూహం, పద్మద్వీపంలాంటి ఎన్నో కళాకండాలను మనం వీక్షించవచ్చు. బ్రహ్మలోకంలోకి ప్రవేశించగానే కమలంలో పుష్పాసనంలో కూర్చొని ఉన్న బ్రహ్మ, సరస్వతీదేవి యొక్క రూపాలు మనముందు...      


18 ఎకరాల సువిశాల ప్రదేశంలో అత్యంత సుందరంగా నిర్మించబడిన ఈ క్షేత్రంలో... శ్రీరాముని వనవాసం, క్షీరసాగరంలో శేషతల్పంపై పవలించిన విష్ణుమూర్తి, కలకత్తా కాళీమాత, మధుర మీనాక్షి, కాశీ విశ్వనాథుడు, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి, మధుర మీనాక్షి, షిరిడీ సాయినాథుడు, పళని కుమారస్వామి, అయోధ్య రాముడు లాంటి ఎందరో దేవతామూర్తులను కనులారా దర్శించవచ్చు. ఇలా ఒకరేమిటి కాశీ నుండి కన్యాకుమారి వరకు కొలువై ఉన్న దాదాపు అందరు దేవతలను మనం ఇక్కడ చూడవచ్చు

ఒకే చోట ఇంతమంది దేవుళ్ళను దర్శించుకోవడం నిజంగా ఒక అద్భుతం. ఇంతటి విశేషత కలిగిన కళాధామం ప్రపంచవ్యాప్తంగా ఇదొక్కటే అంటే అది అతిశయోక్తికాదు. అదీ మన రాష్ట్రంలో ఉండటం నిజంగా మన అదృష్టం. నానాటికీ మరుగున పడిపోతున్న మన పురాణాలు, సాంస్కృతీ సాంప్రదాయాల గురించి మన పిల్లలకు నేర్పించేందుకు... భక్తితోపాటు, విజ్ఞానాన్నికూడా అందించేందుకు ఈ క్షేత్రం ఎంతో ఉపయోగపడుతుంది.

తన అకుంఠిత దీక్షతో, నానాటికీ అంతరించిపోతున్న మన పౌరాణిక గాధలను నేటితరానికి అందించాలన్న సదుద్దేశంతో ఈ ప్రాజెక్టుకు రూప కల్పన చేశారు కుందా సత్యనారాయణ(72)గారు. దాదాపు 10 సంవత్సరాలపాటు తమిళనాడు, మన రాష్ట్రానికి చెందిన దాదాపు రెండువందల మంది శిల్పకారులు రాత్రింబవళ్ళు ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకున్నారు. మన పురాణ గ్రంథాలను, ఇతిహాసాలను ఆధారంగా చేసుకొని ఈ ధామాన్నిరూపొందించినట్లు సత్యనారాయణగారు వెల్లడించారు.
1 | 2  >>  
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సృష్టికర్త మాయాజాలం "బ్రహ్మ లింగేశ్వరుడు"
శుక్ర దోష నివారణా క్షేత్రం "తిరునావలీశ్వరాలయం"
ఉత్తరాంధ్ర అభయప్రదాత "తిరుమలగిరివాసుడు"
రెండో భద్రాద్రి నెల్లిమర్ల "రామతీర్థం"
సిద్ధార్థుడి తపోస్థలి "బుద్ధగయ"
సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం