ఆంధ్రావని | పుణ్య క్షేత్రాలు | సముద్ర తీరాలు | పర్వత ప్రాంతాలు | అటవీ అందాలు
ప్రధాన పేజి » వినోదం » పర్యాటక రంగం » పుణ్య క్షేత్రాలు » అమరత్వ రహస్యాన్ని భోదించిన "అమర్‌నాథ్" (Tourism | religious | kashmir | amarnath | shiva | parvathi devi | shravan poornima)
 
FILE
చుట్టూ మంచుకొండలతో, రకరకాల పువ్వులతో, సెలయేర్లతో, జలపాతాలతో... లోకంలోని అందాలన్నింటినీ తనలో దాచుకున్న ప్రాంతం కాశ్మీర్. పచ్చదనాల సొగసునంతా లోయల్లో నింపుకోవటమేగాక, ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కూడా ఇది ఆలవాలమయ్యింది. అందులోనూ పరమశివుడు పార్వతీమాతకు అమరత్వ రహస్యాన్ని చెప్పిన ప్రాంతమైన "శ్రీ అమర్‌నాథ్" క్షేత్రం చాలా ప్రతీతి.

శివ భగవానుడు మంచు శివలింగం రూపంలో దర్శనమిచ్చే ఈ అమర్‌నాథ్ క్షేత్రం... హిమాలయా పర్వతశ్రేణిలోని జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌కు 125 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి సుమారు 12,730 అడుగుల ఎత్తులో ఉంటుంది. 60 అడుగుల వెడల్పు, 25 అడుగుల లోతు, 15 అడుగుల ఎత్తు ఉన్న ఈ అందమైన, మనోహరమైన గుహ సహజసిద్ధమైనది.

హిమాలయాలు పరమశివుడి నివాసమని, ఆయన ఈ మంచుకొండల్లోనే సంచరిస్తుంటాడని హిందువుల నమ్మకం. అందుకే అమరనాథ్ గుహలో వెలసిన పరమశివుడు అమరనాథుడిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ స్వామివారు శ్రావణ పౌర్ణమినాడు ఉద్భవించారని చెబుతుంటారు. అందువల్లనే భక్తులంతా శ్రావణ పౌర్ణమినాడు దర్శనానికి లక్షల సంఖ్యలో తరలివస్తుంటారు.
FILE


అమరనాథ్ యాత్ర నాగపంచమి రోజున మొదలై, శ్రావణ పౌర్ణమి రోజున గుహవద్ద ముగుస్తుంది. ఈ ఊరేగింపును "ఛడి ముబారక్" అంటారు. ఈ విశిష్టమైన రోజున స్వామివారిని దర్శించుకుంటే, సర్వపాపాలు తొలగి కైలాసం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఊరేగింపు సందర్భంగా భక్తులు పరమశివుడిని భక్తిశ్రద్ధలతో కీర్తిస్తూ ఎంతో ఉత్తేజంగా, ఉల్లాసంగా పాల్గొంటారు.
ముస్లిం సోదరులకు సలామ్...!
అమర్‌నాథ్‌లో గుర్రాలు నడిపేవారు, డోలీలు మోసేవారు, సదుపాయాలు చేసేవారు, చివరకు స్థలపురాణం చెప్పేవారు అందరూ స్థానిక ముసల్మానులే..! "ఓం నమశ్శివాయ అనండి. ఆ శివుడే మీ భయాలను పోగొడుతాడని" నిలువెల్లా భక్తిభావాన్ని ప్రదర్శించే ఆ ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు....


స్థల పురాణం విషయానికి వస్తే... పరమశివుడు అమరుడు ఎలా అయ్యాడన్న తన సందేహాన్ని తీర్చమని పార్వతీదేవి శివుడిని కోరుతుంది. తాను ఈ రహస్యం చెప్పాలంటే, మనం ఇద్దరు తప్ప వేరే ఏ జీవి ఇక్కడ ఉండకూడదని.. అలా ఎవరయినా విన్నట్లయితే, వారు కూడా అమరులవుతారని, అది సృష్టి విరుద్ధమని.. పార్వతిదేవితో అంటాడు శివుడు.

ఎంత చెప్పినా పార్వతీదేవి ఆ రహస్యాన్ని చెప్పమని పట్టుబట్టడంతో.. శివుడు ఆమెను ఎలాంటి జీవీ నివసించని హిమాలయా పర్వతాల మధ్యనుండే ఒక గుహను అనుకూలమైనదిగా భావిస్తాడు. ఆ తరువాత పహల్‌గామ్‌లో నందిని, చందన్‌వాడలో చంద్రుడిని, మహాగునస్ వద్ద వినాయకుడిని, పంచతరుణి వద్ద పంచభూతాలను వదలి గుహ వద్దకు చేరుకుంటాడు శివుడు.

ఎవరూ లేరని నిర్ధారించుకున్న తరువాత శివుడు పార్వతీదేవికి అమరత్వ కథను చెప్పటం ప్రారంభిస్తాడు. అయితే కథను వింటున్న పార్వతీదేవి మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది. అది గమనించని శివుడు కథ మొత్తాన్ని చెబుతాడు. కథను పూర్తిగా ఆలకించావా దేవీ.. అని ఆమెను అడుగగా, తాను ఊకొడుతూ నిద్రలోకి జారిపోయానని అసలు విషయం చెబుతుందామె.
 
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.