ఆంధ్రావని | పుణ్య క్షేత్రాలు | సముద్ర తీరాలు | పర్వత ప్రాంతాలు | అటవీ అందాలు
ప్రధాన పేజి » వినోదం » పర్యాటక రంగం » పుణ్య క్షేత్రాలు » సతీదేవి ఆరాధ్య దేవతగా వెలసిన "కాళీఘాట్" (Religious | Sathidevi | Lord Shiva | Kolkata | Kalighat | Dhaksha | Sakthi Peetam | West Bengal | Hugli River)
Feedback Print Bookmark and Share
 
Kolkata Kali
FILE
దక్షయజ్ఞం సమయంలో అవమాన భారాన్ని భరించలేని సతీదేవి అగ్నికి ఆహుతవుతుంది. సతీదేవి కళేబరాన్ని భుజంపై వేసుకున్న శంకరుడు రుద్రమూర్తియై ప్రళయ తాండవం చేస్తాడు. ఆ సమయంలో శంకరుడి తాండవం వేగానికి తట్టుకోలేని సతీదేవి శరీర భాగాలు 52 ప్రదేశాలలో పడి అవి ప్రసిద్ధ శక్తి పీఠాలుగా పేరుగాంచాయి. అలా సతీదేవి కుడికాలి బొటనవ్రేలు భాగం పడిన ప్రదేశమే "కాళీఘాట్".

మరో కథనం ప్రకారం.. ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడుగానీ.. కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి..? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని) తోడుగా దర్శనమిస్తుంది.
విశాలమైన త్రినేత్రాలతో...!
విశాలమైన త్రినేత్రాలతో, పొడవైన బంగారు నాలుకతో, నాలుగు చేతులతో అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో తెగిన తలను ధరించిన అమ్మవారు అభయ వరద ముద్రలతో కనువిందు చేస్తుంటారు. మోక్షాన్ని కోరే మానవుడు తనలోని అహంకారాన్ని వదిలితే కాళీమాత అభయాన్ని


అలా భారతదేశపు ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటిగా, కలకత్తా కాళీమాతగా.. బెంగాల్ ప్రజలకు ఆరాధ్య దేవతయై నిత్యపూజలందుకుంటున్న "కాళీఘాట్" ఆలయం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని.. హుగ్లీ నదీ తీరంలో విలసిల్లుతోంది. కాళీఘాట్ వల్లనే కలకత్తా నగరానికి ఆ పేరు వచ్చినట్లుగా చెబుతుంటారు. ఇంకా ఇక్కడ సహస్త్ర భుజకాళీ, సర్వమంగళ, తారాసుందరి, సింహవాహిని ఆలయాలున్నాయి. కాళీరూపం భయంకరమైనదే అయినప్పటికీ.. ఆ మాత దుష్ట సంహారానికి, శిష్టజన రక్షణకు పేరుగాంచారు.

అతిపురాతమైన కాళీఘాట్ ఆలయ స్థల చరిత్రను చూస్తే... గతంలో భగీరథీ నది (హుగ్లీ) సమీపం నుంచి ఒక తీక్షణమైన కాంతిపుంజం రావటం గమనించిన ప్రజలు.. ఆ కాంతి బొటనవ్రేలు ఆకారంలోగల ఒక శిల నుంచి వస్తుండటాన్ని గుర్తించారు. వెంటనే ఆ అడవిలో వెలసిన కాళికాదేవి ఆరాధించసాగారు. అక్కడే నకులేశ్వర భైరవ స్వయంభు లింగాన్ని కూడా కనుగొన్నారు. తరువాత సబర్నరావ్ చౌదరి కుటుంబం ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు. చిత్‌పూర్‌లో సైతం ఈ కుటుంబం చిత్రేశ్వర కాళికాలయాన్ని నిర్మించారు.

కాళీఘాట్ ఆలయాన్ని 16వ శతాబ్దంలో మాన్‌సింగ్ రాజు నిర్మించాడు. బనీసా ప్రాంతానికి చెందిన సబర్నరావ్ చౌదరీ ఆలయ అభివృద్ధికి తోడ్పడటంతో 1809 నాటికి ఆలయ నిర్మాణం పూర్తయినట్లుగా తెలుస్తోంది. ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న నట్‌మందిర్ మండపాన్ని.. 1835లో జమిందార్‌ కాశీనాథ్‌రావ్ నిర్మించారు. ఆ తరువాత 1960వ సంవత్సరంలో వివాదాలతో నడుస్తున్న ఈ ఆలయం ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. అప్పట్నించీ హల్దార్ వంశీయులు ఆలయ పూజాదికాలను నిర్వహిస్తున్నారు.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.