ఆంధ్రావని | పుణ్య క్షేత్రాలు | సముద్ర తీరాలు | పర్వత ప్రాంతాలు | అటవీ అందాలు
ప్రధాన పేజి » వినోదం » పర్యాటక రంగం » పుణ్య క్షేత్రాలు » త్రిమూర్తులే "వీరబ్రహ్మేందులు"గా ఉద్భవించిన వైనం..!! (Religious | Potuluri Veera Brahmendra Swami | Brahma | Vishnu | Maheswara)
Bookmark and Share Feedback Print
 
Brahmendra Swami
FILE
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం భగవంతుడు అనేక అవతారాలలో అవతరిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఇలా త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అవతరించిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే కలియుగంలో ప్రజలను జాగృతం చేసేందుకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామిగా అతరించారు.

ఆ రోజుల్లో సమాజంలో నెలకొన్న అంటరానితనం, బాల్య వివాహాలు, సతీ సహగమనం లాంటి అనేక సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు ఉద్భవించిన భగవత్ స్వరూపమే శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఈయన హిందూ-ముస్లిం సఖ్యత, సర్వమానవ సమానత్వం, సహపంక్తి విందులు పాటించటంతోపాటు కాలజ్ఞానాన్ని బోధించేవారు. శాంతి అభ్యుదయాలను నెలకొల్పేందుకు, లోక కళ్యాణార్థం తపస్సు చేసేందుకు వీర బ్రహ్మేంద్ర స్వామివారు సజీవ సమాధి అయ్యారు.

బ్రహ్మేంద్ర స్వామి జన్మ రహస్యాన్ని చూస్తే.. కర్ణాటక రాష్ట్రంలోని బ్రహ్మాండపురంలో క్రీ.శ. 1608న జన్మించారు. కార్తీశుద్ధ ద్వాదశి రోజున.. పరిపూర్ణమాచార్యులు, ప్రకృతాంబలకు ఈయన జన్మించారు. పుట్టగానే తండ్రిని కోల్పోయిన వీర బ్రహ్మేంద్రుడిని అత్రి మహామునికి అప్పగించి తల్లి ప్రకృతాంబ కూడా చనిపోతుంది.

అక్కడికి దగ్గరలో గల పాపాగ్ని పీఠంలోని వీరభోజయ్య స్వామి, వీరపాపమాంబలు తమకు సంతానం లేరు కాబట్టి, ఆ బాలుడిని తమకివ్వాలని అత్రి మహామునిని వేడుకున్నారు. దీంతో వారి పరిస్థితిని అర్థం చేసుకున్న అత్రి మహాముని వారికి ఇచ్చేస్తాడు. ఆ బాలుడికి వీరయ్య అనే పేరుపెట్టుకుని వీరభోజయ్య దంపతులు సంతోషంగా పెంచుకుంటారు.

5వ ఏట విద్యాభ్యాసం నేర్చుకున్న వీరయ్య, 14వ ఏట వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా బనగానపల్లెకు చేరుకుని తపస్సు చేయసాగాడు. ఆ క్రమంలోనే ఆ ఊర్లోని గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంట్లో గోవులకాపరిగా పనికి కుదిరాడు. అక్కడ పశువులను కాస్తూ, సమీపంలోని రవ్వలకొండలోగల గుహలో కూర్చుని తాటాకులపై భవిష్యత్తులో ఏమి జరుగుతుందో కాలజ్ఞాన గ్రంథాన్ని రచించాడు.

కలియుగంలో 5వేల సంవత్సరాల తరువాత జరిగే వింతలను గూర్చి ఆయన తన కాలజ్ఞానంలో తెలిపారు. అప్పట్లో బనగానపల్లె నవాబుకు తమ మహిమలను తెలిపిన వీరయ్య, కడపజిల్లా బద్వేలు తాలూకాలోగల కందిమల్లాయపల్లెకు చేరుకుని అక్కడే ఓ కుటీరాన్ని నిర్మించుకుని జీవించసాగాడు. ఇక్కడ సేద్యం చేస్తూ జీవించిన ఆయన రాత్రివేళల్లో గ్రామంలోని ప్రజలకు కాలజ్ఞానం బోధించేవారు. అలా ఆయన చెప్పినవాటిల్లో ఇప్పటికే కొన్ని జరిగిపోయాయి కూడా.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.