ప్రధాన పేజి > వినోదం > పర్యాటక రంగం > సముద్ర తీరాలు > మర్చిపోలేని మధురజ్ఞాపకం... ఆగ్రా సందర్శనం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మర్చిపోలేని మధురజ్ఞాపకం... ఆగ్రా సందర్శనం
ఉత్తర భారతదేశంలోని ప్రముఖమైన పర్యాటక ప్రాంతాల్లో ఆగ్రాను ప్రముఖంగా చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని యమునానదీ తీరాన వెలసిన ఈ నగరంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. ప్రపంచం యావత్తూ చూడాలని తపించే పాలరాతి కట్టడం తాజ్‌మహల్ ఈ నగరానికే చెందినది కావడం విశేషం.

తాజ్‌మహల్‌తో పాటు ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ లాంటి పర్యాటక ప్రాంతాలు ఆగ్రాను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మార్చాయి. ఆగ్రాలోని తాజ్‌మహల్, ఆగ్రాకోట, ఫతేపూర్ సిక్రీలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వసంపదగా గుర్తించబడి సంరక్షించబడుతున్నాయి.

నగర చరిత్ర
ఆగ్రా నగరం మొఘలుల పరిపాలనకు ముందు ఎవరి పాలనలో ఉండేది అనే ఆధారాలు తక్కువగా ఉన్నా ప్రపంచ గుర్తింపు వచ్చేలా ఈ నగరాన్ని తీర్చిదిద్దింది మాత్రం మొఘలులనే చెప్పవచ్చు. భారతదేశాన్ని మొఘలులు పాలించిన కాలంలో ఆగ్రాలో పైన పేర్కొన్న ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలెన్నో నిర్మించారు.

ఆగ్రాలోని ప్రముఖ సందర్శక ప్రదేశాలు
ఆగ్రా కోట
యునెస్కో వారసత్వ సంపదగా రక్షించబడుతోన్న ఈ కోటను స్థానికంగా లాల్ ఖిల్లా అంటారు. మొఘల్ రాజ్య చక్రవర్తులైన బాబర్, హుమయున్, అక్బర్, షాజహాన్, ఔరంగజేబులాంటి వారంతా ఈ కోటలోనే నివశించారు. ఆగ్రా కోట మొఘల్ చక్రవర్తులకు ముందే నిర్మించబడిన ఓ అద్భుత కట్టడం. అయితే రాజపుత్రుల కాలంలో నిర్మించిన ఈ కోట తర్వాత కాలంలో శిధిలావస్థకు చేరుకుంది.

1 | 2  >>  
మరిన్ని
అనిర్వచనీయ అనుభూతి రామేశ్వర సందర్శనం
ఈ బీచ్‌లలో ఇంటిల్లపాదికి ఆనందం
శృంగార ప్రేరేపిత తీరాలు
అత్యంత ఖరీదైన విహారయాత్ర
భూతల స్వర్గానికి కట్టుదిట్టమైన భద్రత  
ప్రశాంతతకు మారుపేరు కోవలం బీచ్