ముఖ్యంగా బి.ఆర్. కొండలను పిల్లలతో కలిసి పర్యటించడం మంచిది. ఎందుకంటే... ఇక్కడి పక్షులు, రకకాల జంతువులు, అరణ్యంలోని సుందర దృశ్యాలు పిల్లల్ని అలరిస్తాయి, ఆనందాన్నిస్తాయి. వివిధ రకాల జంతుజాలాన్ని దగ్గరగా చూడడం వల్ల ప్రకృతి గమనం వారికి బోధపడుతుంది. పచ్చటి పర్యావరణాన్ని తిలకిస్తూ కొత్త అనుభూతులను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇలాంటి యాత్రలు అహ్లాదాన్నిస్తాయి.
వసతి సౌకర్యాల విషయానికి వస్తే... బి.ఆర్. కొండల అభయారణ్యంలో పర్యాటకులకు కొన్ని వసతి సౌకర్యాలు లేకపోలేదు. అడవిలోని అందమైన ప్రదేశాలలో అటవీ శాఖవారు నిర్మించిన కాటేజీల నుండి వన్యప్రాణులు, అపురూప వన దృశ్యాలను చూడవచ్చు. వీటికి తోడు జంగిల్ లాడ్జిలు, రిసార్ట్స్లలోనూ వసతి సౌకర్యాలు ఉంటాయి. ఈ యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలకు కర్ణాటక అటవీశాఖ అధికారులను సంప్రదిస్తే సరిపోతుంది. |