ప్రధాన పేజి   వినోదం > పర్యాటక రంగం > ఆంధ్రావని
 
ఈ నెల 23 నుంచి అజంత-ఎల్లోరా ఫెస్టివల్
చారిత్రాత్మక అజంత-ఎల్లోర శిల్పాల ప్రాశస్త్యాన్ని వ్యాపింపజేసే దిశగా ఈ నెల 23వ తేదీ నుంచి అజంత-ఎల్లోర ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది జరిగే ఈ 17వ శతవార్షిక ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన 23వ తేదీన "గజల్" గాయకుడు గులామ్ అలీ, చిత్రకారుడు అబ్జిత్ పొహన్కార్‌లు పాల్గొననున్నారని జిల్లా కలెక్టర్ మరియు ఫెస్టివల్ సబ్-కమిటీ ఛైర్మన్ సంజీవ్ జైస్వాల్ విలేకరులతో చెప్పారు.

ఈ సంగీత ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున ఉస్తాద్ అబ్జద్ అలీ ఖాన్ సరోద్ వాదన, పండిత్ ప్రభాకర్ హిందూస్థానీ గాత్ర సంగీతం, అనురాధా పాల్ (తబల) మరియు ఫ్రెంచ్ నేషనల్ దేవయాని భరతనాట్యం వంటి కార్యక్రమాలు జరుగనున్నాయి.

అంతేకాకుండా షర్బని ముఖర్జీ రాధిక- ఆధ్యాత్మిక గాత్ర సంగీతం, దేష్ పండే, గజ్ర కాంబినేషన్‌లో జానపద సంగీత కచేరీలు కూడా జరుగనున్నాయని జైస్వాల్ అన్నారు. ఈ ఉత్సవాల చివరిరోజున అనుయా దేశ్‌ముఖ్ భరతనాట్యం, సంజయ్ జోషి, ధనశ్రీ దేవ్, రోహిణి సింగావేర్, ముకుంద్ పాండె మరాఠి నాట్య సంగీత కచేరీ జరుగనుందని ఆయన వివరించారు.
మరిన్ని
సత్యనారాయణ స్వామి కొలువుతీరన ''అన్నవరం''
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణలోని ప్రధాన ఘట్టాలు
దక్షిణ కాశీ... వేములవాడ దివ్యక్షేత్రం