ప్రధాన పేజి > వినోదం > పర్యాటక రంగం > ఆంధ్రావని > మధురానుభూతుల సమ్మేళనం "కదళీవనం"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మధురానుభూతుల సమ్మేళనం "కదళీవనం"
FILE

దత్తాత్రేయ అవతారంగా చెప్పబడే శ్రీ నరసింహ సరస్వతీ స్వామి ఎన్నో సంవత్సరాలుగా తపస్సుచేసి "అక్కల్ కోట మహరాజ్"గా పేరుగాంచారు. ఈ మహానుభావుడు తపస్సు చేసిన చోటే "కదళీవనం"గా ప్రసిద్ధిగాంచింది. శ్రీశైలానికి దగ్గర్లో ఉండే ఈ ప్రాంతంలో సరస్వతీ స్వామివారు తపస్సు చేసి, ఆ తరువాత తన తపశ్శక్తినంతటినీ షిర్డీ సాయిబాబాకి ధారపోశారని స్థానికుల విశ్వాసం.

శ్రీశైలం నుంచి గంటన్నర దూరంలో ఉండే ఈ కదళీవనం చేరుకునేందుకు కృష్ణానదిలో పడవ ప్రయాణం చేస్తూ వెళ్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. నదికి రెండువైపులా కొండలు, ఆ కొండలపై పచ్చటి వనాలు, ఆ వనాలలోంచి వినబడే పక్షుల కిలకిల రావాలతో ఒకటిన్నర గంటల ప్రయాణం అప్పుడే అయిపోయిందా అనిపించక మానదు.

కృష్ణమ్మ ఒడి నుంచి దిగి అలా సేదతీరితే కదళీవనం ప్రారంభమార్గానికి చేరుకుంటాం. ఇక అక్కడినుంచి 12 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. రెండు మూడు కొండలెక్కాలి, ఇక దారి అయితే సమతలంగా ఉండదు. కొనదేలిన రాళ్లతో ఉండే ఆ మార్గంలో నడవాలంటే తప్పనిసరిగా ఊతంగా కర్రలు ఉండాల్సిందే. పక్కనే కనిపిస్తున్న కృష్ణమ్మ అందాలను చూస్తూ, ముళ్లమొక్కలను తప్పించుకుంటూ ముందు సాగుతుంది ప్రయాణం.
స్వామివారి చుట్టూ పుట్ట మొలిచిందట..!
  తపస్సు చేస్తుండగా స్వామివారి చుట్టూ పెద్ద పుట్ట మొలిచిందట. కొన్నాళ్ల తరువాత పుట్ట పక్కనే ఉన్న చెట్టును కొడుతున్న చెంచు, పొరపాటున పుట్టకు గొడ్డలితో తగిలించాడట. పుట్టలోంచి రక్తం రావడంతో కంగారుపడ్డ ఆ చెంచు అతను పుట్టను చదును చేసేందుకు...      


అలా వెళ్తుండగా "గుహ" అనే ప్రాంతానికి చేరుకునేలోపు దట్టమైన రెల్లుగడ్డి మనకు స్వాగతం పలుకుతుంది. దాంట్లోంచే ముందుకు సాగాలి, ముందున్నవాళ్ళూ, వెనకనున్నవాళ్ళూ ఎవరూ ఎవరికి ఇందులో కనిపించరు. ఆ రెల్లుగడ్డి ప్రాంతంలో పులులు కూడా సంచరిస్తూ ఉంటాయట. కాబట్టి, జాగ్రత్తగా ముందుకు సాగాల్సి ఉంటుంది.

రెల్లుగడ్డిని తప్పించుకుని బయటికి రాగానే ఎదురుగా గుహ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లేదాకా అసలు అక్కడో గుహ ఉందన్న సంగతే తెలియదు. గుహలోకి వెళ్లాలంటే కాస్త కిందికి దిగి, వరుసగా రాళ్లతో పేర్చి ఉన్న మెట్లపైనుంచి జాగ్రత్తగా కిందికి దిగాల్సి ఉంటుంది. ఇక లోపలికి వెళ్లగానే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ గుహలో నరసింహ సరస్వతీ, అక్క మహాదేవిల విగ్రహాలుంటాయి. అందుకే ఈ గుహను "అక్కమహాదేవి గుహ" అని కూడా పిలుస్తుంటారు. ఆమె ఈ గుహలో తుదిశ్వాస విడిచారని అక్కడి ప్రజలు చెబుతుంటారు.

నరసింహ సరస్వతీ స్వామివారు కూడా ఈ గుహలోనే తపస్సు చేశారట. లోపల మూడంతస్తుల్లా ఉండే ఈ గుహలోని పై అంతస్తు చాలా విశాలంగా ఉంటుంది. దాదాపు వెయ్యిమంది కూర్చుని ఒకేసారి ధ్యానం చేసుకునేలా ఉంటుంది. గుహ కింది అంతస్తుకి వెళ్లి చూసేందుకు దారి ఉండదు.
1 | 2  >>  
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
శిల్పకళా సౌందర్యాల కాణాచి "గండికోట"
"లేపాక్షి బసవన్న"ను కనులారా వీక్షిద్దామా..?!
బాదామి చాళుక్యులు ఏలిన "ఆలంపూర్"
"పాపికొండల" విహారానికి సరికొత్త నియమావళి
పవిత్రత, ప్రాచీనతలకు నెలవైన "భట్టిప్రోలు స్థూపం"
పచ్చంచు కోక కట్టిన పల్లెపడుచు "కంబాల కొండ"