ఆంధ్రావని | పుణ్య క్షేత్రాలు | సముద్ర తీరాలు | పర్వత ప్రాంతాలు | అటవీ అందాలు
ప్రధాన పేజి » వినోదం » పర్యాటక రంగం » ఆంధ్రావని » అమరావతీ నగర అపురూప శిల్పాలు....! (Tourism | ap tourism | amaravati | andhra pradesh | guntur | krishna river | dharanikota)
 
Amaravati
FILE
రేఖలలో లావణ్యం, రంగులలో రమణీయత, భావనలో సౌందర్యం, శైలిలో నవ్యత... వీటన్నింటి కలబోతయే అమరావతీ శిల్పసౌందర్యం. కళాక్షేత్రంగా అమరావతి ఆర్జించిన కీర్తి అద్భుతమైంది. వీటిద్వారా ఆంధ్ర శిల్పి నైపుణ్యం దేశ విదేశాలలో వ్యాపించటమేగాక.. అమరావతీ శిల్ప రీతియే ఆంధ్ర రీతిగా మారి పల్లవ, చాళుక్యాది శిల్పులకు ఒరవడిగా నిలిచింది.

ఆనాడు ఆంధ్రభూమిని కళామయం చేసిన అమరావతీ శిల్పాలు ఆంధ్రులకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించిపెట్టాయి. ఆధునిక సభ్యతా సంస్కృతులు, సౌందర్య అలంకార విషయాలలో కలిగించిన ప్రతి పరిణామం ఇప్పటికి సుమారు రెండువేల సంవత్సరాల క్రితం విలసిల్లిన అమరావతీ కళలోనే కనిపించటం ఆశ్చర్యకరమైన విషయం.

ఒకనాడు బౌద్ధులు విశ్వవిద్యాలయాలను స్థాపించి, మహోన్నతమైన చరిత్ర సృష్టించిన ప్రాంతమే అమరావతి. ఇది గుంటూరు జిల్లాకు 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆనాటి బౌద్ధుల వైభవ చిహ్నాలు ఈనాటికీ చరిత్ర సాక్ష్యాలై మన కళ్లముందు నిలుస్తూ స్వాగతం పలుకుతున్నట్లుగా ఉండే అమరావతీ నగరం.. పావన కృష్ణానదీమతల్లి తీరాన నెలకొని ఉంది.

అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉండే ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకం. ప్రాచీన బౌద్ధ వాజ్మయంలో విశిష్ఠ స్థానం పొందిన 'ఆంధ్రపురి'యే ఈ ధాన్యకటకం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. బుద్ధుని జీవితకాలం నుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది.
స్త్రీలు సౌందర్య, శృంగార పిపాసులే..!
అమరావతీ శిల్పాలలోని స్త్రీ మూర్తులను గమనించినట్లయితే ఆ కాలపు స్త్రీలు సౌందర్య, శృంగార అంశాల మీద ఎంతగా శ్రద్ధ వహించేవారో అట్టే అర్థమవుతుంది. కొన్నిచోట్ల నగ్నంగా స్త్రీలను చెక్కినాగానీ, ధార్మిక భావనకు ఏ మాత్రం భంగం వాటిల్లని రీతిలో.. బుద్ధుడి గాథతో...


మౌర్యులు, సదవంశీయులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, శాలంకాయనులు, విష్ణుకుండినులు, అనంద గోత్రీయులు, చాళుక్యులు, చోళులు, కోట వంశీయులు, కాకతీయులు, విజయనగర రాజులు, కుతుబ్ షాహి నవాబులు వరుసగా అమరావతి/ధరణికోటను పాలించారు. క్రీ.శ. 4వ శతాబ్ది నుండి 15వ శతాబ్దం వరకు ధరణికోట ఆంధ్రదేశ రాజకీయ చరిత్రలో కీలకస్థానం వహించింది.

ఆంధ్రదేశమందు, ముఖ్యంగా కృష్ణానదీ లోయలో.. బౌద్ధమతం మౌర్యకాలము నుండి పరిఢవిల్లింది. అమరావతి (ధరణికోట), భట్టిప్రోలు, జగ్గయ్యపేట (బేతవోలు), ఘంటసాల, శాలిహుండం మొదలైన చోట్ల స్తూప నిర్మాణం జరిగింది. వీటిలో అమరావతి స్తూపం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.

గృహనిర్మాణం కోసం ధ్వంసం చేయబడుతున్న స్తూప కట్టడాలు, శిల్పాల గురించి విన్న కల్నల్ కోలిన్ మెకంజీ 1797లో ఈ మహోన్నత సంపదను వెలికితీసి రక్షణకు నాంది పలికారు. "దీపాలదిన్నె"గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797వ సంవత్సరంలో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చారు. అయితే అప్పటికే మహాచైత్యం (స్తూపం) అంతా కూలిపోయి 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల ఒక దిబ్బలాగా మిగిలింది.

అనేక విడతలుగా జరిగిన తవ్వకాలలో ఎన్నో విలువైన విగ్రహాలు, పరికరాలు మరియు ఇతర వస్తువులు దొరికాయి. చివరిగా జరిగిన తవ్వకాలలో ఈ చైత్య నిర్మాణానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నివసించిన మెగాలిథ్స్‌కి సంబంధించిన అవశేషాలు కూడా దొరికాయి. ఇక్కడ దొరికిన శిల్పాలలో ఎక్కువ మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియం, చెన్నై మరియు బ్రిటిష్ మ్యూజియం, లండన్ మ్యూజియంలలో భద్రపరిచారు.

ఈ మహాస్తూప సమూహంలో బౌద్ధ భిక్షువులకు ఆవాసాలు, విద్యాసంబంధిత కట్టడాలు కూడా అనేకం వున్నాయి. వీటిలో చాలావరకు స్థానికుల, భక్తుల విరాళాలతో కట్టబడ్డాయి. అద్భుతమైన శిల్పకళతో అలరారే ఈ స్థూపంపై బుద్దుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. స్థూపంపై బ్రాహ్మీ లిపిలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి.
 
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.