రాష్ట్రంలోని ప్రముఖ టీవీ ఛానల్ మా టీవీలో సోమవారం నుంచి 'మా టీవీలో మీ తీర్పు' అనే కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది. సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి తొమ్మిది గంటలకు దీన్ని ప్రసారం చేస్తారు. మూడు రోజుల పాటు కథను చూపిస్తారు. మూడో రోజు ఆఖరులో ఆ కథకు సంబంధించి రెండు రకాల ముగింపును మీకు తెలుపుతారు.
అందులో.. మీ తీర్పు ఏమిటో ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో అధిక సంఖ్యలో వచ్చిన ఎస్ఎంఎస్ తీర్పును ఆధారంగా ఆ తీర్పును నాలుగో (గురువారం) ప్రసారం చేస్తారు. ఇందుకోసం ఎయిర్ టెల్, ఐడియా, హచ్ మొబైల్స్ వినియోగదారులు 7337కు, రిలయన్స్ వినియోగదారులు 6336కు, బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు 1255573కు ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది.
|