కావలసిన పదార్థాలు :సగ్గుబియ్యం... రెండు కప్పులుబియ్యంపిండి... మూడు కప్పులుఉల్లితురుము... రెండు కప్పులుఇడ్లీరవ్వ... ఒక కప్పుమంచినీరు... తగినన్నిపచ్చిమిర్చి తురుము... అర కప్పుకరివేపాకు తురుము... అర కప్పునూనె... తగినంతజీలకర్ర... ఒక టీ.ఉప్పు... తగినంతతయారీ విధానం :సగ్గుబియ్యంలో బియ్యప్పిండి, ఇడ్లీరవ్వ, ఉల్లి తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు తురుము, జీలకర్ర, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి కలిపి 6 గంటలపాటు నాననివ్వాలి. బాణలిలో నూనె పోసి కాగిన తరువాత పుణుకుల మాదిరిగా దోరగా వేయించి తీయాలి. వీటిని అల్లం, కొబ్బరి పచ్చడితో నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. పాయసం చేసేటప్పుడు... ఒక కప్పు సగ్గుబియ్యానికి 4 కప్పులు నీళ్లు పోస్తే గిన్నెకు అంటుకుపోకుండా ఉండలు కట్టకుండా చక్కగా ఉడుకుతాయి.. ఆపై అందులోనే చల్లని నీళ్లు పోసి వాటిని వంచేస్తే అవి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి. పాయసం చేసే ముందుగా వీటిని ఇలా ఉడికించి తరువాత పాయసంలో కలిపితే భలేగా ఉంటాయి. |