కావలసిన పదార్థాలు : మైదాపిండి.. ఒక కప్పు మెంతిపొడి.. రెండు టీ. ఉప్పు.. ఒక టీ. నూనె.. సరిపడా వాము.. అర టీ. ఛాట్ మసాలా.. కాస్తంత
తయారీ విధానం : ముందుగా మైదాపిండిలో మెంతిపొడి, వాము, ఉప్పు, రెండు టీస్పూన్ల నూనె వేసి తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. నిమ్మకాయ సైజంత పిండిని తీసుకుని పలుచగా వత్తుకుని కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. వీటిని బాగా కాగుతున్న నూనెలో వేసి కరకరలాడేలా వేయించి తీసేయాలి. చల్లారిన తరువాత వాటిపై ఛాట్ మసాలా చల్లి అతిథులకు సర్వ్ చేయాలి.