కావలసిన పదార్థాలు : బంగాళాదుంపలు... 200 గ్రా. శెనగపిండి, మైదా... చెరో అరకప్పు వెన్న... రెండు టీ. ఉప్పు...తగినంత నూనె... నాలుగు టీ.
తయారీ విధానం: ఉడికించిన బంగాళాదుంపల్లో మైదా, సెనగపిండిని కలిపి బాగా ముద్దలా చేయాలి. అందులో పచ్చి మిర్చి, కొత్తిమీర తరుగులు చేర్చండి. దీనికి వెన్నను బాగా కలిపి నచ్చిన షేప్లో తయారు చేసుకుని నూనె రాసిన ప్లేట్పై ఉంచాలి. వాటిని దోశె పెనంపై ఒక్కొక్కటిగా రెండు పక్కలా బ్రౌన్ కలర్గా వచ్చేదాకా వేయించి తీయాలి. అంతే బంగాళాదుంపల కట్లెట్ సిద్ధం. వీటికి గ్రీన్ చట్నీగానీ, టొమోటో సాస్గానీ సైడ్డిష్గా వాడుకోవచ్చు.