బియ్యం రొట్టెలకు బెస్ట్ సైడ్డిష్ "జెల్లీ ఫిష్ కర్రీ"
FILE
కావలసిన పదార్ధాలు : జెల్లీ ఫిష్.. ఒక కేజీ ఉల్లిపాయ.. ఒకటి చింతపండు.. నిమ్మకాయంత కారం.. 2 టీ. జీలకర్ర పొడి.. 1 టీ. పసుపు.. అర టీ. ధనియాలపొడి.. 1 టీ. అల్లం వెల్లుల్లి పేస్ట్.. 2 టీ. నూనె.. 4 టీ. మెంతులు.. 1 టీ. ఆవాలు.. తగినన్ని ఉప్పు.. తగినంత
తయారీ విధానం : నూనె వేడి చేసుకుని అందులో మెంతులు, ఆవాలు వేసి పోపు పెట్టుకోవాలి. ఆ తరువాత ఉల్లిపాయల్ని వేసి వేగిన తరువాత వెల్లుల్లి పేస్ట్ కలపాలి. ఆపై శుభ్రం చేసిన జెల్ల చేపలను కూడా అందులో వేసి 5 నిమిషాలు ఉడికించాక.. జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు కలపాలి. పది నిమిషాలపాటు ఉడికిన తరువాత కూరని దించేయాలి. అంతె జెల్లీ ఫిష్ కర్రీ తయార్..! ఈ కూరని బియ్యంపిండితో చేసిన రొట్టెలతో కలిపి తింటే అదిరిపోతుంది.