కావలసిన పదార్థాలు :పచ్చి శెనగపప్పు... పావు కేజీపచ్చిబఠాణీలు... 150 గ్రా.పచ్చిమిర్చి... నాలుగుఆవాలు... రెండు టీ.అల్లం... చిన్న ముక్కపంచదార... ఒక టీ.ఆమ్చూర్... అర టీ.నిమ్మకాయ... ఒకటినూనె... వంద గ్రా.కొత్తిమీర... ఒక కట్టకొబ్బరి తురుము... రెండు టీ.ఉప్పు... తగినంతకారం... ఒక టీ.తయారీ విధానం :ముందుగా శెనగపప్పును శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోయాలి. అందులోనే బఠాణీలు, ఉప్పు వేసి ఉడికించాలి. అల్లం, పచ్చిమిర్చి కలిపి ముద్దగా నూరుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, పసుపు, అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసి వేయించాలి. తరువాత అందులో ముందుగానే ఉడికించిన పప్పు, బఠాణీలతో పాటు ఉప్పు, కారం వేసి కలపాలి.తరువాత పంచదా, ఆమ్చూర్, కొబ్బరి తురుము వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. చివర్లో నిమ్మరసం పిండి, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే వేడి వేడి శనగపప్పు బఠాణీల కూర రెడీ అయినట్లే..! ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలు, రోటీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. |