ప్రధాన పేజి > ఇతరాలు > కౌంట్‌డౌన్ 2009 ఏపీ ఎలక్షన్స్ > వార్తలు > పాలమూరు స్థానం వద్దని రాములమ్మ అలక!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పాలమూరు స్థానం వద్దని రాములమ్మ అలక!
వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌నగర్ (పాలమూరు) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) మహిళా నేత, సినీ నటి విజయశాంతి విముఖత వ్యక్తం చేశారు. ముందుగా మహబూబ్‌నగర్ నుంచి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ బరిలో దిగాలని భావించారు. అయితే, శనివారంనాటికి ఆయన అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకొని విజయశాంతికి పాలమూరు స్థానాన్ని ప్రకటించారు.

మెదక్ నుంచి స్వయంగా బరిలోకి దిగాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ అనూహ్య పరిణామంతో ఖంగుతిన్న రాములమ్మ.. అలకపాన్పు ఎక్కినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, తన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని ఆమె సన్నిహితులతో వ్యాఖ్యానించినట్టు సమాచారం. కాగా, శనివారం మరో తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లతో లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెరాస మహిళా నాయకురాలు విజయశాంతిని మహబూబ్‌నగర్ స్థానం నుంచి పోటీలో దింపుతున్నట్లు ప్రకటించారు. అయితే, కేసీఆర్ ప్రతిపాదనపై విజయశాంతి ప్రతిస్పందిస్తూ మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసే విషయమై తానింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారని సమాచారం.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అనకాపల్లి నుంచి అల్లు అరవింద్ పోటీ: చిరు
ఆదికేశవులుకు ప్రజారాజ్యం పార్టీ తీర్థం!
నేటి నుంచి యువరాజ్యం "పులి" ప్రచారం
10 సీట్లకు అభ్యర్థుల పేర్లను వెల్లడించిన సీపీఎం
తెరాస నాలుగో జాబితా విడుదల
ఉమ్మడి గుర్తుపై జయప్రకాష్ హర్షం