ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తన నాలుగో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే మూడు విడతలుగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివారాలు వెల్లడించిన తెదేపా శనివారం అర్థర్రాతి 28 అసెంబ్లీ, నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు నాలుగో జాబితాను ప్రకటించింది. లోక్సభ స్థానాలకు రాజమండ్రికి సినీ నటుడు మురళీమోహన్, నరసాపురం నుంచి తోట సీతామహాలక్ష్మి, హిందూపురం నుంచి నిమ్మల కృష్ణప్ప, రాజంపేట నుంచి లక్కిరెడ్డి రమేశ్ కుమార్ రెడ్డిల పేర్లు ప్రకటించింది. కాగా, అసెంబ్లీకి ప్రకటించి అభ్యర్థుల వివరాలు ఇలా వున్నాయి.
ఖానాపూర్ (ఎస్టీ).. సుమన్రాథోడ్, ఆదిలాబాద్.. జోగు రామన్న, ముథోల్.. ఎస్.వేణుగోపాలాచారి, మల్కాజ్గిరి..శారదామహేష్, శేరిలింగంపల్లి.. మువ్వా సత్యనారాయణ, మలక్పేట.. మహ్మద్ ముజ్ఫర్ అలీఖాన్, వనపర్తి.. రావుల చంద్రశేఖర్రెడ్డి, ములుగు (ఎస్టీ).. ధన్సారి అనసూర్య (సీతక్క), ఇల్లెందు (ఎస్టీ).. ఊకే అబ్బయ్య, ఇచ్ఛాపురం.. ప్రియా సాయిరాజు, ఎచ్చెర్ల.. నాయని.. సూర్యనారాయణరెడ్డి, విశాఖ (తూర్పు).. వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ (ఉత్తరం).. బి.జయ, అరకు (ఎస్టీ).. సివిరి సోమ, అనకాపల్లి.. దాడి వీరభద్రరావు, ఎలమంచలి.. లాలం భాస్కర్రావు, కాకినాడ.. రూరల్ పిర్లి అనంతలక్ష్మి, ముమ్మడివరం.. నడిమిపల్లి శ్రీనివాసరాజు, నిడదవోలు.. బూరుగపల్లి శేషారావు, నర్సాపురం.. బమిడి నారాయణరావు, దెందులూరు.. చింటమనేని ప్రభాకర్, చింతలపూడి (ఎస్సీ).. డాక్టర్ రాజారావు, అవనిగడ్డ.. అంబటి బ్రాహ్మణయ్య, మైలవరం.. దేవినేని ఉమామహేశ్వరరావు, మంత్రాలయం.. బాలనాగిరెడ్డి, గుంతకల్లు.. సాయినాథ్గౌడ్, కల్యాణదుర్గం.. ఉన్నం హనుమంతరాయ చౌదరి, జూబ్లీహిల్స్.. ఎండీ.సలీంలు ఉన్నారు. |