ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్, ఎల్జేపీ నేత రామ్విలాస్ పాశ్వాన్లిరువురినీ యూపీఏకు దూరంగా ఉంచాలని బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ అధిష్టానాన్ని అభ్యర్థించింది.
లాలూ, పాశ్వాన్లిద్దరినీ దూరంగా ఉంచాలని బీహార్లోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారని బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యూనిట్ అధినేత అనిల్ కుమార్ శర్మ వెల్లడించారు.
లాలూ, పాశ్వాన్లు అవకాశవాద రాజకీయవాదులని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకు వీరిరువురూ శతవిధాలా యత్నించారని, అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతకు కాంగ్రెస్ పార్టీకి భాగం ఉందని అనేక ఆరోపణలు చేశారని శర్మ దుయ్యబట్టారు. కనుక వీరిరువురినీ యూపీఎ నుంచి తొలగించాలని ఆయన కోరారు.