పాదాలు పగలడానికి చాలా కారణాలున్నాయి. చలికాలంలో పాదాలలో పగుళ్ళు వస్తుంటాయని అధికంగా ఫిర్యాదులు వస్తుంటాయి. చలికాలంలో కాలి చర్మంలోని స్వేద గ్రంథులనుంచి సిబెషియస్ సెక్రిసన్ అనే పేరుగల ఒకరకమైన రసం ఊరుతుంది. దీని కారణంగానే చర్మం పొడిబారుతుంది. అలాగే చల్లటి గాలికి వలన పగుళ్ళు ఏర్పడుతాయి. కాళ్ళకు జోళ్ళు లేకుండా బయట తిరిగితే కూడా కాళ్ళకు పగుళ్ళు వస్తుంటాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు.
పాదాల పగుళ్ళకు కారణం ** పాద రక్షలు లేకుండా తిరగడంతో ఒకరమైన ఫంగస్ కాళ్ళకు అంటుకుంటుంది. దీంతో ఈ ఫంగస్ పాదాలలో పెరిగి పగుళ్ళకు దారితీస్తుంది.
** ఇంట్లో వాడే డిటర్జెంట్ పౌడర్, సబ్బుల కారణంగాకూడా పగుళ్ళు ఏర్పడుతాయంటున్నారు వైద్యులు.
** బురద, నీళ్ళల్లో ఎక్కువగా పని చేస్తుంటే కూడా కాళ్ళు పగిలిపోవడానికి ఆస్కారముంది.
** ప్లాస్టిక్ పాదరక్షలు వాడటంమూలానకూడా పగుళ్ళు ఏర్పడుతాయని అంటున్నారు వైద్యులు. ** మధుమేహంతో బాధపడేవారు అలాగే ఊబకాయం ఉన్నవారుకూడా వారి బరువు కాళ్ళపై పడటంతో పగుళ్ళకు దారితీస్తుంది. శరీరంలో విటమిన్లు, ఐరన్ లేక కాల్షియం తక్కువ కావడంచేత పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయంటున్నారు ఆరోగ్యనిపుణులు. |