వర్షాకాలంలో అజీర్ణ వ్యాధి కలిగించే ఆహారాన్ని తీసుకోకూడదు. ముఖ్యంగా వర్షాకాలంలో ఆకు కూరలు తినడాన్ని కాస్త తగ్గిస్తే మంచిది. ఆకు కూరలలో నీరు అధికంగా ఉండటం వలన జీర్ణశక్తి తగ్గుతుంది. వర్షాకాలంలో ఆకుకూరలపై క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఆకు కూరలకు బదులు కాయలు, పులుసు, సాంబార్, చట్నీల వంటివి తీసుకోవచ్చు. పుదీనా, చట్నీ, ఉల్లి, వెల్లుల్లితో చేసిన పదార్థాలు వాడితే జీర్ణశక్తి పెరుగుతుంది. రక్తాన్ని శుద్ధి పరుస్తాయి. ఆకలి పెరుగుతుంది.
పులుపు పదార్థాలు పెరుగు, మజ్జిగలాంటివి బాగా తగ్గించాలి. ఇవి కడుపులో ఆమ్ల మోతాదును పెంచుతాయి. వేడి చేసి చల్లార్చిన నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.